MLC Kavitha tweet on tunnel accident

టన్నెల్ ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్

ప్రమాదంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే స్పందించాలి

హైదరాబాద్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శ్రీ శైలం ఎడమ కాలువ గట్టు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం ట్వీట్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే స్పందించాలని పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదం ఎలా జరిగిందో తేల్చాలని కవిత ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు. ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ పై కప్పు కూలిన ఘటనలో కూలీలు గాయపడటం అత్యంత దురదృష్టకరమన్నారు.

Advertisements
టన్నెల్ ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత

దీనికి ఎవరు బాధ్యులు?

కేసీఆర్‌ హయాంలో 10 కి.మీ. మేర టన్నెల్‌ తవ్వారని..ఏనాడూ ఇటువంటి ప్రమాదం జరగలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 4 రోజుల కిందనే పనులు మొదలు పెట్టిందని..అంతలోనే ఈ పెను ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యులని? కవిత అడిగారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఈ ఘటనపై స్పందించాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు. ఇంకా 9 కి.మీ.లకు పైగా టన్నెల్‌ తవ్వాల్సి ఉందని.. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు.

ఆకస్మాతుగా కూలిన పైకప్పు

కాగా, ఈరోజు ఉదయం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి షిఫ్ట్‌లో సుమారు 50 మంది కార్మికులు సొరంగంలోకి వెళ్లారు. ఉదయం 8.30 గంటల సమయంలో కార్మికులు పని చేస్తుండగా.. ఆకస్మాతుగా పైకప్పు కూలి మట్టిపెల్లలు విరిగి పడ్డాయి. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు

Related Posts
APSP బెటాలియన్లలో మార్పులు
Changes in APSP Battalions

ఆంధ్రప్రదేశ్‌లో APSP (ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్) బెటాలియన్లలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి, కర్నూలు కేంద్రంగా రెండు Read more

జెనీవా సమావేశంలో పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్పందన
జెనీవా సమావేశంలో పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్పందన

జెనీవాలో జరిగిన UN మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ జమ్మూ & కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం భారతదేశం తీవ్రంగా తప్పుబట్టింది. భారతదేశం ఈ ఆరోపణలకు దీటుగా Read more

Donald Trump: ట్రంప్‌-హార్వర్డ్ విద్యా సంస్థ మధ్య పెరుగుతున్న వివాదాలు!
ట్రంప్‌-హార్వర్డ్ విద్యా సంస్థ మధ్య పెరుగుతున్న వివాదాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విదేశీ విద్యార్థులు, వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎవరైనా వర్సిటీ ప్రాంగణాల్లో పాలస్తీనా అనుకూల నినాదాలపై కన్నెర్ర జేస్తున్నారు. ఈ Read more

TTD: నేడు శ్రీవారి అర్జితసేవా టికెట్ల కోటా విడుదల
Srivari Arjitha Seva tickets quota released today

TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్‌ నెల కోటాను మార్చి 18న ఉదయం 10 Read more

Advertisements
×