డబుల్ బెడ్ ఇళ్లు ఇప్తిస్తానని రూ.83 లక్షలు వసూలు
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కె.పి. వివేకానంద్ వద్ద పి.ఎగా పనిచేసిన వ్యక్తి డబుల్ బెడ్ రూం (Double bedrooms)లను మంజూరీ చేయిస్తామని చెబుతూ లంచావతారమెత్తి అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలైన సంఘ టన తీవ్ర వివాదాస్పదంగా మారింది. అయితే తమవద్ద పిఎగా పనిచేసి ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంవత్సరం క్రితమే విధులనుండి తొలగించామంటూ ఏకంగా ఎంఎల్ఎ కె.పి. వివేకానంద్ మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేయడం కొసమెరుపు. బాలానగర్ సహయ పోలీసు కమిషనర్ నరేశ్ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ వద్ద పి.ఎ హారిబాబు
కుత్బుల్లాపూర్ శాసన సభ్యులు కె.పి.వివేకానంద్ వద్ద పి.ఎ.గా పని చేస్తున్న బొమ్మిడిశెట్టి హారిబాబు (Haribabu) కంప్యూటర్ ఆపరేటర్ గానూ, పింఛన్లు, డబుల్ బెడ్ రూంల దరఖాస్తులతోపాటు ఎంఎల్ఎకు వచ్చే వివిధ ఫిర్యాదులపై ఉన్నతాధికారులకు దరఖాస్తులను బట్వాడా చేస్తుంటాడు. అయితే గత సంవత్సరం తనవద్ద లక్ష రూపాయలు నగదు డబుల్ బెడ్రూమ్లను మంజూరీ చేయిస్తానని గిరినగర్ సంక్షేమ సంఘానికి చెందిన తైలంరమేశ్ వద్ద వసూలు చేశాడు. డబుల్ బెడ్రూమ్ తనకు ఎంతకూ మంజూరీ కాకపోవడంతో బాదితుడు పలుమార్లు వత్తిడితెచ్చినా ఫలితంలేకపోవడంతో జూలై 14న జీడిమెట్ల పోలీసుల (Jeedimetla Police)ను ఆశ్రయించాడు.
84 మంది వద్ద లక్ష రూపాలయ వసూళ్ల
ఈమేరకు జీడిమెట్ల సర్కిల్షన్స్పెక్టర్ గడ్డంమల్లేశ్ ఆధ్వర్యంలో కేసు నమోదుచేసుకుని విచారించగా సదరు ఫిర్యాదుదారుడినుండేకాక చాలమందివద్ద డబుల్ బెడ్రూమ్ ను ఇప్పిస్తామని చెప్పి వసూళ్లు చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. దీనితో బాలానగర్ సమయ పోలీసు కమిషనర్ నరేశ్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరపగా మొత్తం 84 మందివద్ద ఒక్కొక్కరివద్ద లక్ష రూపాలయ నుండి ఆపై మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. మొత్తం ఎనమిది మందివద్ద ఎంఎల్ఎ పి.ఎ. సుమారు లక్ష రూపాయల చొప్పున అందించినట్లు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ల పేరుతో వసూలు చేసిన రు.లు.84లక్షల వ్యయంతో కుత్బుల్లా పూర్ గ్రామ సమీపంలోని భూమ్ రెడ్డినగర్ లో ఇంటిని నిర్మిస్తున్నట్లు తమ విచారణలో తెలిసిందని బాలానగర్ ఎసిపి నరేశ్ రెడ్డి వివరించారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: BC Hostels: బిసి హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని ఆనంద్ గౌడ్ డిమాండ్