ponguleti indiramma

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన లబ్ధిదారులకు ఇది అందించాలనే ప్రభుత్వ విధానమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రెవెన్యూ వ్యవస్థ, సర్వేయర్ల నియామకంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ఇండ్లకు అర్హులైన లబ్ధిదారుల నివాస స్థల పరిస్థితుల ప్రకారం రెండు జాబితాలను గ్రామసభల్లో ఉంచాలని మంత్రి అధికారులకు సూచించారు. దశల వారీగా ఇండ్ల నిర్మాణం చేపట్టి, ప్రతి అర్హుడికి ఇండ్లు అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉన్న 274 ఇంజనీర్లు అన్ని పరిశీలిస్తున్నప్పటికీ, అదనంగా 400 మంది ఇంజనీర్లు అవసరమని అధికారులు తెలిపారు. ఇతర ప్రభుత్వ విభాగాల ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా ఉపయోగించే అవకాశాలపై చర్చ జరిగిందని , ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని, ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమించేందుకు వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి పరీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి విధివిధానాలను త్వరగా రూపొందించి, పారదర్శకతతో నియామక ప్రక్రియ చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం ఉన్న 450 మంది సర్వేయర్లకు అదనంగా 1000 మంది అవసరమని పేర్కొంటూ, ఈ నియామకాలు నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Related Posts
జైలు నుంచి విడుదలైన ఢిల్లీ మాజీ మంత్రి.. హత్తుకుని ఆహ్వానించిన కేజ్రీవాల్
Ex minister of Delhi who was released from jail. Kejriwal touched and invited

న్యూఢిల్లీ: ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయన Read more

ప్రతిపక్షాల అబద్ధాలను తిప్పికొట్టాలి: మహేష్ కుమార్ గౌడ్
mahesh kumar

ప్రతిపక్ష నేతలు ప్రచారం చేస్తున్న అబద్ధాలను తిప్పికొట్టాలని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని Read more

ట్రంప్ తొలిరోజే 200కు పైగా సంతకాలు!
trump

ప్రపంచ మీడియా అంతా ట్రంప్ ప్రమాణస్వీకారంపై ఫోకస్ చేసింది. ఎలాంటి హామీలు ఇవ్వనున్నారు వంటి అంశాలపై దృష్టిని సారించింది. అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Read more

సీఐడీ విచారణకు హాజరుకాలేనన్న వర్మ
సీఐడీ విచారణకు హాజరుకాలేనన్న వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోమవారం గుంటూరులో సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ, వ్యక్తిగత కారణాలను చూపిస్తూ, వర్మ తన హాజరును Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *