tummala runamfi

డిసెంబర్ 9 లోగా రుణమాఫీ పూర్తి చేస్తాం అంటున్న మంత్రి తుమ్మల

ఈరోజు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రుణమాఫీ కూడా ఒకటి. ఎన్నో ఏళ్లుగా రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పడం తో..కాంగ్రెస్ పార్టీ ఆ మాట నిలబెట్టుకుంటుందనే నమ్మకంతో రైతులు కాంగ్రెస్ కు జై కొట్టారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆగస్టు 15 లోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. కానీ రుణమాఫీ మాత్రం పూర్తి స్థాయిలో చేయలేకపోయింది. కేవలం 25% మందికి మాత్రమే చేసి..మిగతా వారికీ చేయలేదు. దీంతో రుణమాఫీ జరగని రైతులంతా ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో మంత్రులు ఎప్పటికప్పుడు రుణమాఫీ తప్పకుండ చేస్తామని మాట ఇస్తూ వస్తున్నారు. తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ..డిసెంబర్ 9 లోగా ప్రతి రైతుకు రుణమాఫీ పూర్తి చేసి.. ఆ తర్వాత రైతు భరోసా రూ.7500 రైతుల అకౌంట్లోకి జమ చేస్తామన్నారు. హాలియా మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా.. బుధవారం లక్ష్మీనరసింహ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9 నాటికి రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సన్నాలకు రూ.500 బోనస్ అందజేస్తామని తెలిపారు. నల్లగొండ జిల్లాలో రైతులు పామాయిల్ సాగు గణనీయంగా పెంచాలని, రైతుల సౌకర్యార్థం పామాయిల్ ఉత్పత్తి కేంద్రాన్ని నల్లగొండ జిల్లాలో సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు కనీస సౌకర్యాలు అందించేందుకు మార్కెట్ యార్డులు కృషి చేయాలని కోరారు.

Related Posts
భారత్-ఖతార్ ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం
భారత్-ఖతార్ ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం

భారత్, ఖతార్ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాపనపై మంగళవారం అధికారికంగా ఒప్పందం మార్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ Read more

రేవంత్ విధానాల వ‌ల్ల ప్ర‌జ‌లు విసిగిపోతున్నారు: తీన్మార్ మ‌ల్ల‌న్న
People are getting tired of Revanth policies.. Teenmar Mallanna

హైద‌రాబాద్ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై పై నిప్పులు చెరిగారు.రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి కుర్చీకి పునాది వేసింది తానే అని Read more

పుష్ప 2 ప్రీమియర్ షో వద్ద తొక్కిసలాట..బాలుడి పరిస్థితి విషమం
sandhya thater

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ మూవీ ప్రీమియర్ షోస్ మొదలయ్యాయి. ప్రీమియర్ షో చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్ల Read more

తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ: సిఎం
తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ: సిఎం

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, దాదాపు 40 మంది గాయపడిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు న్యాయ విచారణను ఆదేశించారు. ఈ ఘటన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *