minister sitakka launched telangana disabled job portal

దివ్యాంగులకు ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగం: మంత్రి సీతక్క

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రైవేట్ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే శుభవార్త చెప్పనుంది. వారికి వీలైనంత త్వరగా ప్రైవేటు ఉద్యోగాల కోసం ఆయా సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా జాబ్‌పోర్టల్‌ను అందుబాటులో తెచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో దివ్యాంగుల సంక్షేమశాఖలో కలిసి జాబ్‌పోర్టల్‌ https://pwdjobportal.telangana.gov.in ను మంత్రి ఆవిష్కరించారు.

Advertisements

దీంతో పాటుగా మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టరేట్‌ కాల్‌ సెంటర్‌లో 10 మంది దివ్యాంగులకు నియామకపత్రాలు అందజేశారు. త్వరలోనే దివ్యాంగులకు ఇందిరమ్మ గృహాలు, ఇతర సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల్లో 5 శాతం నిధులు వారి కోసం ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఆలోచిస్తూ వారికి అందించే ఉపకరణాల కోసం రూ.50 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. త్వరలోనే దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. స్వయం ఉపాధి పథకాలకు చేయూత అందిస్తామన్నారు.

Related Posts
నూతన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్
Gyanesh Kumar as the new Election Commissioner

నేటితో ముగియనున్న ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్‌కుమార్‌.. భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా నియమితులయ్యారు. Read more

వివాహేతర సంబంధం ద్వారా పిల్లలను కన్నా భర్తే తండ్రి: సుప్రీంకోర్టు
వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరుల నియామకం వద్దు:సుప్రీంకోర్టు

ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోయాయి. అన్యోన్య దాంపత్య జీవితంలో ఈ వివాహేతర సంబంధాలు ఎన్నో అనర్థాలకు దారితీయడంతో పాటు ఎన్నో నేరాలకు తావిస్తున్నాయి. వాటి వల్ల Read more

భోజన ప్రేమికుల కోసం సరికొత్త మెనూని పరిచయం చేసిన బౌగెన్‌విల్లా రెస్టారెంట్
Bougainvillea Restaurant introduces a brand new menu for food lovers copy

హైదరాబాద్ : వినూత్నమైన వంటకాలకు ప్రసిద్ధి చెందిన ప్రీమియం రెస్టారెంట్, బౌగెన్‌విల్లే , భోజన ప్రేమికుల కోసం సరికొత్త మెనూని పరిచయం చేసినట్లు వెల్లడించింది. రెండేళ్ళ క్రితం Read more

హైదరాబాద్‌లో వేయి కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్‌లో వేయి కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఈ ఏడాది నగరంలోని అన్ని ప్రధాన, ముఖ్యమైన మార్గాల్లో దాదాపు 1,000 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని యోచిస్తోంది. అధికారుల Read more

×