VLF Radar Station in Telang

అలాంటి అపోహలే పెట్టుకోవద్దు – సీఎం రేవంత్

వికారాబాద్ దామగుండం ఫారెస్టులో ప్రారంభించబోయే ‘వీఎల్ఎఫ్’ రాడార్ స్టేషన్ ప్రాజెక్టుపై అపోహలొద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు మరింత గౌరవం తీసుకొస్తుందని , దీనివల్ల ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇచ్చారు.

Advertisements

వికారాబాద్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో దామగుండం ఫారెస్ట్ లో విఎల్ఎఫ్ స్టేషన్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో ముందడుగు వేయబోతోంది అన్నారు. వికారాబాద్ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా నేను, స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే విఎల్ఎఫ్ స్టేషన్ ప్రారంభించు కోవడం గర్వకారణం అన్నారు.

విఎల్ఎఫ్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. దీనివల్ల వచ్చే రేడియేషన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడుతుందని, స్థానిక ప్రజలకు అనేక ఇబ్బందులు వస్తాయని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాజ్ నాధ్ సింగ్ మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతోనే ఇక్కడ దేశంలోనే రెండవ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దేశ భద్రత విషయంలో నేవి కీలక పాత్ర పోషిస్తుందని.. ఇక్కడి రాడార్ స్టేషన్ నిర్మాణం ద్వారా సబ్ మెరైన్ లతో కమ్యూనికేషన్ బలపడుతుందన్నారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు తగదని, సీఎం రేవంత్ రెడ్డి అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిది అంటూ.. సీఎంకు అభినందనలు తెలిపారు.

Related Posts
సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌
Delhi Ex CM Arvind Kejriwal Vacates Official Home With Family

Delhi Ex-CM Arvind Kejriwal Vacates Official Home With Family న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి Read more

రతన్ టాటా ఆస్తి అంత ఎవరి సొంతం అవుతుంది…?
Who will own Ratan Tatas p

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) మరణించారు. అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా Read more

ఈరోజు ఇందిరా పార్క్‌ వద్ద బీజేపీ మహా దర్నా..
BJP Maha Dharna at Indira Park today

హైదరాబాద్‌: హైడ్రా, మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ ఈరోజు(శుక్రవారం) ఇందిరా పార్క్ వద్ద ఆందోళన నిర్వహించనుంది. మూసీ పరివాహక Read more

పుష్ప 2 ఆదాయం, పన్ను వివరాలు వెల్లడించిన RTI
పుష్ప 2 ఆదాయం, పన్ను వివరాలు వెల్లడించిన RTI

పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన పన్ను చెల్లింపుల వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. సీపీఎం నాయకుడు Read more

Advertisements
×