हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Floor Painting : కృష్ణ‌మ్మ తీరంలో కుంచెతో కోటి భావాలు

Sudheer
Floor Painting : కృష్ణ‌మ్మ తీరంలో కుంచెతో కోటి భావాలు

విజయవాడ నగరపాలక సంస్థ (VMC) ఆధ్వర్యంలో ఆదివారం హరిత హారం పార్కులో ఏర్పాటు చేసిన ఫ్లోర్ పెయింటింగ్ మరియు డ్రాయింగ్ పోటీలకు యువత, చిన్నారుల నుంచి విశేష స్పందన లభించింది. 300 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలలో వారు తమ కళా ప్రతిభను ప్రదర్శించి, పర్యావరణ అంశాలపై జాగ్రత్తగా ఆలోచించేలా చిత్రాలు వేశారు. స్వర్ణాంధ్ర విజన్ @2047, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛత, నీటి పరిరక్షణ, రీసైకిల్ తదితర థీమ్స్‌పై వేసిన చిత్రాలు ప్రజలలో చైతన్యం కలిగించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ, ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వాడ నగరానికి స్ఫూర్తిదాయక మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.

పర్యావరణంపై అవగాహన కలిగించే వారపు కార్యక్రమాలు

ఈ పోటీల విజయవంతంగా నిర్వహణతో ఉత్సాహం పొంది ప్రతివారం హరిత హారం పార్కులో సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఫొటోగ్రఫీ, యోగా, స్విమ్మింగ్ వంటి కార్యక్రమాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భవానీ ఐలాండ్‌లో బర్డ్స్ ఫొటోగ్రఫీ పోటీలు, జిల్లాలోని పర్యాటక ప్రాంతాలలో వేర్వేరు థీమ్స్‌తో కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమాల వల్ల చిన్నారుల్లో అవగాహన పెరిగి, సెలవులను సద్వినియోగం చేసుకునేలా మారతారని పేర్కొన్నారు.

పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

పోటీల విజేతలకు కలెక్టర్ లక్ష్మీశ‌, కమిషనర్ ధ్యానచంద్రలు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఫ్లోర్ పెయింటింగ్‌లో జి.తనూజ మొదటి బహుమతి రూ. 10,000 పొందగా, డ్రాయింగ్ విభాగంలో ఎంఎస్ వైష్ణవ్య తొలి బహుమతి అందుకుంది. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా పి.చిదంబరేశ్వరరావు తదితరులు వ్యవహరించారు. ఇదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అవార్డుల్లో విజయవాడ నగరం సూపర్ స్వచ్ఛతా లీగ్ అవార్డు గెలుచుకోవడం గర్వకారణమని అధికారులు తెలిపారు. ఇది ప్రజలు, సిబ్బంది అందరి కృషికీ ఫలితమని పేర్కొన్నారు.

Read Also : Bonalu : ఘ‌నంగా ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాల జాత‌ర

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870