Megastar receives lifetime achievement award

Chiranjeevi : జీవిత సాఫల్య పుర‌స్కారం అందుకున్న మెగాస్టార్‌

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లండన్‌లో ఉన్న విషయం తెలిసిందే. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌.. యూకే పార్లమెంట్‌లో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. ‘లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌’ (జీవిత సాఫల్య పురస్కారం) పురస్కారాన్ని చిరంజీవికి ప్రదానం చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకిగానూ చిరంజీవికి ఈ గౌరవం దక్కింది.

Advertisements
జీవిత సాఫల్య పుర‌స్కారం అందుకున్న

మెగా అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు

యూకే అధికార లేబర్‌ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా నేతృత్వంలో ఈ సత్కారం జరిగింది. పార్లమెంట్‌ సభ్యులు సోజన్‌ జోసెఫ్‌, బాబ్‌ బ్లాక్‌మాన్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. చిరంజీవిని సత్కరించి ఈ అవార్డు ఇచ్చిన వీడియోలు, ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. మెగా అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలానే తెలుగువారికి, దేశానికి మరిన్ని పేరు ప్రఖ్యాతలు చిరంజీవి తెచ్చిపెట్టాలంటూ ఆకాంక్షిస్తున్నారు.

‘గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌’ రికార్డుల్లోకి

ఇక చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. గతేడాది మెగాస్టార్ ఏకంగా ‘గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌’ రికార్డుల్లోకి కూడా ఎక్కారు. 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల స్టెప్పులతో ఆడియన్స్‌ని అలరించినందుకు గాను చిరంజీవికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. అలానే పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందించి కేంద్ర ప్రభుత్వం చిరుని గౌరవించింది.

Related Posts
Sarada Peetham : శారదా పీఠానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ
శారదా పీఠానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ

Sarada Peetham : శారదా పీఠానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ విశాఖపట్నంలో ఉన్న శారదా పీఠానికి తాజాగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ Read more

HCU: గచ్చిబౌలి భూముల విచారణపై 24 కు వాయిదా
గచ్చిబౌలి భూముల విచారణను 24కి హైకోర్టు వాయిదా

​కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఇటీవల తెలంగాణ హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో విచారణలు జరిగాయి. ఈ వివాదంలో 400 ఎకరాల అటవీ భూమిని ఐటీ పార్కుల కోసం Read more

నేటితో ముగియనున్న కుంభమేళ పుణ్యస్నానాలు
నేటితో ముగియనున్న కుంభమేళ పుణ్యస్నానాలు

నేడు మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. కిటకిటలాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ఆలయాల ముందు బారులు తీరి నిల్చున్నారు భక్తులు. తెల్లవారు Read more

ఐదేళ్ల తర్వాత థియేటర్స్ లోకి రానున్న సినిమా..ఎప్పుడంటే?
ఐదేళ్ల తర్వాత థియేటర్స్ లోకి రానున్న సినిమా..

టాలీవుడ్ యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ, తన డీజే టిల్లు సినిమాతో అదిరిపోయే క్రేజ్ ను సాధించాడు. ఈ సినిమాతో సిద్దు, యూత్ ఫాలోయింగ్ లో భారీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×