money robbery

రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ దొంగతనం చోటుచేసుకుంది. పూర్తీ వివరాల్లోకి వెళితే.. అనంతపురం నగర శివారులో దొంగలు బీభత్సం సృష్టించారు. శివారెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో కూతురు పెళ్లి కోసం ఉంచిన నగదు, రూ.కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకెళ్లారు. పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం నగర శివారులోని బెంగుళూరు – హైదరాబాద్ హైవే సమీపంలో సవేరా ఆస్పత్రి వెనుక వైపు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి రాజహంస విల్లాస్‌లో బుధవారం భారీ చోరీ జరిగింది. దుండగులు బీరువాలో దాచి ఉంచిన రూ.20 లక్షల నగదుతో పాటు ప్రత్యేక లాకర్‌లో ఉంచిన రూ.3.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.

ఫిబ్రవరిలో కుమార్తె పెళ్లి ఉండడంతో బంగారం, డబ్బు అంతా ఇంట్లోనే ఉంచుకున్నట్లు వ్యాపారి దంపతులు తెలిపారు. పెళ్లి కార్డులు బంధువులకు ఇవ్వడానికి వెళ్లినప్పుడు దొంగతనం జరిగినట్లు చెప్పారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts
ఏపీలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లు సీజ్..కారణం అదే
pushpa 2 screening theaters

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప 2 చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. Read more

శాసనసభలో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల ప్రణాళిక
శాసనసభలో క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల

శాసనసభలో క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల ప్రణాళిక.గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారితో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశం జరిగింది. ఈ Read more

‘శక్తి టీమ్స్’ను ప్రారంభించిన చంద్రబాబు
'శక్తి టీమ్స్'ను ప్రారంభించిన చంద్రబాబు

'శక్తి టీమ్స్'ను ప్రారంభించిన చంద్రబాబు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం అనేక కీలక కార్యక్రమాలను ప్రకటించింది. మహిళా సంక్షేమానికి బలమైన Read more

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల వీరంగం: భక్తులపై దాడి, ఐదుగురు మృతి
ఏనుగుల దాడిలో ఐదుగురు భక్తుల మృతి.. అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం: ఐదుగురు భక్తుల దుర్మరణం అన్నమయ్య జిల్లాలో శివరాత్రి వేడుకలు విషాదంలో ముగిశాయి. ఆలయ దర్శనానికి వెళ్లిన భక్తులను ఏనుగుల గుంపు దాడి Read more