Massive encounter in Chhattisgarh.. 16 Maoists killed

Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్.. 16మంది మావోలు హతం

Chhattisgarh : ఈరోజు (శనివారం) ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈక్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు 16 మందిని హతమార్చారు. కెర్లపాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌గార్డ్‌ , సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

భారీ ఎన్‌కౌంటర్ 16మంది మావోలు

ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వారు అమర్చిన ఐఈడీ పేలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈమేరకు బీజాపూర్‌ పోలీసులు వెల్లడించారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లే మార్గంలో మావోయిస్టులు గతంలో ఐఈడీ అమర్చారు. అడవిలో పండ్లు ఏరుకునేందుకు తన పిల్లలతో కలిసి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి వస్తుండగా.. అనుకోకుండా దానిపై కాలు వేయడంతో ఒక్కసారిగా అది పేలిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు ఆమెను దగ్గర్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related Posts
ప్రపంచ బ్యాంక్ చీఫ్ జోక్: మోదీ, మాక్రాన్‌ల మధ్య స్నేహపూర్వక వాతావరణం
india french

ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా , బ్రెజిల్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో ప్రపంచ నాయకులను నవ్వులతో ఆకట్టుకున్నారు. ఆయన "ఒక భారతీయుడి నుండి మరొకరికి" Read more

సతీసమేతంగా తాజ్‌మహల్‌ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు
Maldives President Mohamed Muizzu and his wife Sajidha Mohamed visit Taj Mahal in Agra

ఆగ్రా: ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు తన సతీమణితో కలిసి మంగళవారం తాజ్‌మహల్‌ ను సందర్శించారు. తాజ్‌మహల్‌ ముందు ఫొటోలు తీసుకుంటూ Read more

నిర్దేశిత కక్ష్యలోకి చేరని ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం..!
NVS 02 satellite that did not reach the specified orbit.

న్యూఢిల్లీ: ఇస్రో గత బుధవారం చేపట్టిన 100వ ప్రయోగానికి అనుకోని అడ్డంకులు ఏర్పడ్డాయి. అంతరిక్షంలోకి పంపిన ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని ఇస్రో తాజాగా ప్రకటించింది. Read more

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌
Former MLA Vallabhaneni Vamsi arrested

కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసినట్టు కేసు నమోదు.. అమరావతి: వైసీపీ కీలక నేత , గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్‌లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *