Married Aghori, Srivarshini

Aghori : పెళ్లి చేసుకున్న అఘోరీ, శ్రీవర్షిణి

Aghori : తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అంశం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణమైన అఘోరీ మరో సంచలనానికి తెర లేపింది. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన వర్షిణి అనే యువతిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఓ చిన్న ఆలయంలో అఘోరీ, వర్షిణీ మెడలో తాళికట్టగా.. ఇద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడంతో పాటు ఏడడుగులు కూడా కలిసి నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో దర్శనమిచ్చాయి. అక్కడే ఉన్న పలువురు భక్తులు ఉత్సహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు.

Advertisements

లేడీ అఘోరీ‌పై కఠిన చర్యలు

అఘోరీ మొదటి భార్యను తానే అంటూ ఓ యువతి సోమవారం సంచలన ప్రకటన చేసింది. అల్లూరి శ్రీనివాస్ జనవరి 1న తనను పెళ్లి చేసుకున్నాడని, అనంతరం జనవరి 13న వర్షిణీ అనే అమ్మాయిని కూడా వివాహం చేసుకున్నాడని ఆరోపించింది. మొదటి భార్యను తాను ఉండగా.. ఇంకో అమ్మయిని ఎలా పెళ్లి చేసుకుంటాడని ప్రశ్నించింది. తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగొద్దనే తాను మీడియా ముందుకు వచ్చానని చెప్పుకొచ్చింది. పోలీస్ శాఖ, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు లేడీ అఘోరీ‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత యువతి కోరింది.

Read Also: నేడు జపాన్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Related Posts
తెలంగాణ కొత్త సీఎస్ ఎవరో..?
telangana cs santhakumari

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత చీఫ్ సెక్రటరీ (సీఎస్) శాంతి కుమారి పదవీ కాలం ఏప్రిల్ 7న ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త సీఎస్ ఎవరు Read more

పార్టీ కీలక నేతలతో కేసీఆర్ భేటీ
పార్టీ కీలక నేతలతో కేసీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామంగా, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈరోజు పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో అత్యంత ప్రాముఖ్యమైన సమావేశం నిర్వహించనున్నారు. Read more

అలీ ఖాన్ దాడి పై ఊహించని బిగ్ ట్విస్ట్
అలీ ఖాన్ దాడి పై ఊహించని బిగ్ ట్విస్ట్

ముంబైలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన కేసు వివాదంలో చిక్కుకుంది.ప్రస్తుతం ముంబై పోలీసులు ఈ కేసు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక Read more

ఇచ్ఛాపురంలో స్వల్ప భూ ప్రకంపనలు
ichapuram earthquake

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. బుధవారం రాత్రి 10:56 గంటలకు భూమి కుదుపుకు గురైనట్లు స్థానికులు తెలిపారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×