మను భాకర్ ఒక ప్రఖ్యాత భారతీయ షూటర్. 2002, ఫిబ్రవరి 18న హర్యానాలో జన్మించారు. మను భాకర్ తన చిన్న వయస్సులోనే షూటింగ్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో ఆమె భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగం, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ మహిళా షూటర్గా గుర్తింపు పొందింది. ఆమె ప్రదర్శనకు గాను భారత ప్రభుత్వం దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న’ అవార్డును ప్రదానం చేసింది. అంతేగాక, బీబీసీ ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును కూడా సొంతం చేసుకుంది. భారత మహిళా క్రీడాకారిణులలో మను భాకర్ ఇప్పుడు ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిగా నిలిచింది. ఆమె కృషి, పట్టుదల యువతకు స్ఫూర్తిగా మారాయి.భారత స్టార్ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు కాంస్య పతకాలు సాధించి, బీబీసీ ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డుకు క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగట్, గోల్ఫర్ అదితి అశోక్, పారా షూటర్ అవని లేఖరా నామినేట్ కాగా, మను భాకర్ విజేతగా నిలిచారు. 22 ఏళ్ల మను భాకర్ ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ మహిళా షూటర్గా రికార్డు సృష్టించారు. పారిస్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లలో ఆమె కాంస్య పతకాలు సాధించారు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను, భారత ప్రభుత్వం ఆమెను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుతో సత్కరించింది.

బీబీసీ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును 2004 నుండి 2022 వరకు భారత మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఉన్న మిథాలీ రాజ్ అందుకున్నారు. బీబీసీ చేంజ్ మేకర్ 2024 అవార్డును చెస్ ప్లేయర్ తానియా సచ్దేవ్, ఖోఖో ప్లేయర్ నస్రీన్ షేక్లు పొందారు. బీబీసీ స్టార్ పెర్ఫార్మర్ 2024 అవార్డును అథ్లెట్ ప్రీతిపాల్, తులసిమతి మురుగేశన్లు గెలుచుకున్నారు. భారత్ తరపున పారాలింపిక్స్లో పతకం సాధించిన అత్యంత పిన్న వయస్కురాలైన 18 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి ‘బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు’ను అందుకున్నారు.బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు 2019లో ప్రారంభమయ్యాయి, అప్పటి నుండి పీవీ సింధు, కోనేరు హంపి, మీరాబాయి చాను వంటి ప్రముఖ క్రీడాకారిణులు ఈ అవార్డును అందుకున్నారు.
పారిస్ ఒలింపిక్స్లో ఘనత
22 ఏళ్ల మనూ భాకర్ పారిస్ ఒలింపిక్స్ 2024లో అత్యుత్తమ ప్రదర్శన చేసి, ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా షూటర్గా అరుదైన ఘనత సాధించారు.10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్.రెండు విభాగాల్లోనూ కాంస్య పతకాలు సాధించడం ద్వారా ఆమె కొత్త రికార్డును నెలకొల్పారు. అంతకుముందు ఆమె టోక్యో ఒలింపిక్స్ 2020లో పాల్గొనినప్పటికీ, ఆమెకు అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు. కానీ పారిస్ ఒలింపిక్స్లో ఆమె మళ్లీ పునరాగమనం చేసి, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి తన మేధస్సు, నైపుణ్యం, ఒత్తిడిని అధిగమించే సామర్థ్యాన్ని నిరూపించుకుంది.