ఢిల్లీ నుండి లక్నోకు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణీకుల్లో ఒకరు గాల్లో ప్రయాణిస్తూనే అనారోగ్యంతో మరణించడం కలకలం రేపింది.ఢిల్లీ నుంచి లక్నో వెళుతున్న విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు అస్వస్థతతో మృతి చెందాడు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఈ రోజు ఉదయం 8 గంటల 10 నిముషాలకు లక్నో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.
ఆసిఫ్ ఉల్లా అన్సారీ
విమాన ప్రయాణంలో ఉన్న ఇతర ప్రయాణికులు అందరూ విమానం దిగుతుండగా, ఒక వ్యక్తి మాత్రం సీటులోనే కదలకుండా ఉండటాన్ని క్లీనింగ్ సిబ్బంది గమనించింది. అతడిని హౌస్కీపింగ్ సిబ్బంది పలుమార్లు పిలిచినా స్పందించకపోవడంతో విమానంలోని ఓ డాక్టర్ను పిలిపించారు. పరీక్షించిన వైద్యుడు ఆసిఫ్ ఉల్లా అన్సారీ అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.
కారణాలు
ఆసిఫ్ మృతి గాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడే జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.విమానం ఎక్కిన తర్వాత అతడికి ఇచ్చిన ఆహార పదార్థాలు అలాగే ఉండడం, సీటు బెల్టు కూడా తీయకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.హార్ట్ ఎటాక్ లేదా ఊపిరితిత్తుల సమస్య కారణంగా మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.అనూహ్యంగా ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా మారిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఆసిఫ్కు పూర్వపు అనారోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అనే విషయంపై అధికారులు పరిశీలిస్తున్నారు.

పోస్టుమార్టం
ఆసిఫ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నివేదిక కోసం ఆసుపత్రికి తరలించారు.ఎయిరిండియా యాజమాన్యం ఈ ఘటనపై విచారణ చేపట్టింది.విమానంలో ఏమైనా అసాధారణ సంఘటనలు జరిగినాయా? అనే దిశగా సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.
ప్రయాణికుల భద్రత
ఈ సంఘటన విమాన ప్రయాణంలో ఆరోగ్య భద్రతపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలా?విమానసిబ్బంది తగినంత వైద్య సహాయం అందించగలరా?గాల్లో ఉన్న సమయంలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే ఏం చేయాలి?ఈ అంశాలపై విమానయాన సంస్థలు భవిష్యత్తులో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.ఆసిఫ్ మృతికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక వెలువడిన తర్వాతే తెలుస్తాయి.