సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం టాలీవుడ్ కాదు, దేశవ్యాప్తంగా సినీప్రియుల్లో భారీ అంచనాలను ఏర్పరచుకుంది. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచిన నేపథ్యంలో, ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి, మహేష్ బాబు గత చిత్రం గుంటూరు కారం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఆయన అభిమానులు SSMB 29 పై మరింత ఆశలు పెట్టుకున్నారు.

SSMB 29 – భారీ బడ్జెట్ యాక్షన్
ఈ చిత్రానికి SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇది హాలీవుడ్ స్థాయిలో రూపొందించే భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. ఈ సినిమా కథ ఆసక్తికరమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని, ముఖ్యంగా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే కథాంశమని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత సమాచారం మేరకు, ఈ సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇది భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ఖరీదైన సినిమాలలో ఒకటిగా నిలవనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు పవర్ఫుల్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. కథ రామాయణ ఇతిహాసం నుంచి కొన్ని అణుశాసనాలను తీసుకున్నట్లు వినిపిస్తోంది. మహేష్ బాబు పాత్ర హనుమంతుడి లక్షణాలతో ఉండేలా రాజమౌళి డిజైన్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. ఇందులో ఆయన ఫిజికల్ గా చాలా మారేలా ప్రిపరేషన్ చేస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమా కోసం గత కొంతకాలంగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. జర్మనీలో ట్రెక్కింగ్, ఫిట్నెస్ ట్రైనింగ్ పూర్తి చేసిన అనంతరం, ఇప్పుడు మరింత మాస్ లుక్లో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. మహేష్ బాబు తన కెరీర్లో ఇంతవరకు లేని విధంగా శరీరదారుఢ్యాన్ని పెంచుతున్నారని, ఆయన పాత్ర పూర్తిగా యాక్షన్-ఆధారంగా సాగుతుందని అంటున్నారు.
ప్రియాంక చోప్రా & పృథ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రియాంక పాత్ర నెగటివ్ షేడ్స్ కలిగిన క్యారెక్టర్గా ఉండబోతుందని టాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా, విలన్గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. కొన్నిరోజుల క్రితం ఓ ఎయిర్పోర్ట్లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ కలిసి కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. దీంతో పృథ్వీరాజ్ ఈ సినిమాలో నటిస్తారని స్పష్టత వచ్చింది. ప్రస్తుతం 40% వీఎఫ్ఎక్స్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇది రెండు భాగాలుగా 2027, 2029 సంవత్సరాల్లో విడుదల కావొచ్చని సమాచారం. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ సీన్ లీక్ కావడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై మహేష్ బాబు స్పందిస్తూ, “లీక్ వీడియోలు చూడటంలో అంత ఆసక్తి ఏముంటుంది? బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఫీల్ డబుల్ అవుతుంది! రాజమౌళి సినిమాలు ఎప్పుడూ థియేటర్లో చూడాల్సిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, త్వరలోనే అధికారిక అప్డేట్స్ వస్తాయి.” అని అన్నారు.