ప్రముఖ సినీ నటుడు సంపూర్ణేష్ బాబు తాజాగా బెట్టింగ్ యాప్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. యువతను బెట్టింగ్ యాప్ల వలలో పడకుండా అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఓ వీడియో విడుదల చేసి, ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలాంటి యాప్లు ప్రజలను, ముఖ్యంగా యువతను తీవ్రంగా నష్టానికి గురిచేస్తాయని, చివరకు వారి జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బెట్టింగ్ యాప్లు
బెట్టింగ్ యాప్ల గురించి సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ,”ఇలాంటి యాప్లు మిమ్మల్ని తక్షణం లాభాల ఊహల్లో పడేసి, చివరికి ఆర్థికంగా కుదేలయ్యేలా చేస్తాయి.ఎక్కువ మందికి ఇది నష్టమే మిగులుస్తుంది.మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరుతున్నా” అని స్పష్టం చేశారు.
సంపూర్ణేష్ బాబు వీడియో
సంపూర్ణేష్ బాబు తనవంతుగా ఈ ప్రచారానికి మద్దతుగా ఓ వీడియో విడుదల చేసి, తన అభిమానులు, ప్రజలు ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడకుండా ఉండాలని పిలుపునిచ్చారు. “ఇలాంటి యాప్లు జీవితాలను నాశనం చేయడమే గానీ, ఎవరినీ బాగుపరచవు. మీరు ఒకవేళ బెట్టింగ్ చేయాలని అనుకుంటే, ఇంట్లో మీ కుటుంబ సభ్యులను ఒకసారి గుర్తు చేసుకోండి. వారి కోసం మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని కోరారు.
ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల ప్రభావంపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ యాప్లను ప్రమోట్ చేస్తూ, ” బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు” అనే విధంగా ప్రచారం చేయడం పెద్ద సమస్యగా మారింది. చాలా మంది ఈ మాయమాటలు నమ్మి, తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. కొందరు తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురై చివరకు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా నమోదయ్యాయి.ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్లపై పోరాటాన్ని ప్రారంభించారు. యువతను అప్రమత్తం చేయడం కోసం పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత ఈ మాయలో పడకుండా, నష్టపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది.
కఠిన చర్యలు
అలాగే, బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “ఈ యాప్ల వల్ల లక్షలాది మంది ఆర్థికంగా కష్టాల్లో పడుతున్నారు. కొంతమంది అప్పుల్లో కూరుకుపోయి జీవితాన్నినే కోల్పోతున్నారు. ప్రభుత్వాలు ఇలాంటి యాప్లను వెంటనే నిషేధించాలి.యువతకు తగిన మార్గదర్శకత్వం ఇవ్వాలి” అని చెప్పారు.
అవగాహన కార్యక్రమాలు
సమాజంలో వీటి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వాలు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్లను పూర్తిగా నిషేధించడంతో పాటు, అవి ఎలా మోసం చేస్తున్నాయో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మరిన్ని చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు.