Liquor policy case hearing today. Kavitha to attend

నేడు లిక్కర్ పాలసీ కేసు విచారణ.. హాజరుకానున్న కవిత

హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట వర్చువల్‌గా ఈరోజు హాజరుకాబోతున్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్‌పై జడ్జి కావేరి బవేజా విచారణ జరపనున్నారు. గత విచారణ సందర్భంగా ప్రతివాదులకు సీబీఐ అందజేసిన ఛార్జ్‌షీట్ ప్రతులు సరిగ్గా లేవని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

Advertisements

తమకు అందజేసిన చార్జ్‌షీట్ కాపీల్లో చాలా పేజీలు బ్లాంక్‌గా ఉన్నాయని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు కోర్టుకు తెలిపారు. సరైన డాక్యుమెంట్స్ సప్లై చెయ్యాలని సీబీఐని రౌస్ అవెన్యూ కోర్ట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (శనివారం) అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరుకాబోతున్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో గత 2 ఏళ్లుగా జైలులో ఉన్న మనీష్ సిసోడియాకు, కొన్ని నెలలు జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ కవితకు కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా కొన్ని రోజుల క్రితమే బెయిల్ వచ్చింది. బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Related Posts
విజయసాయిరెడ్డి కి కౌంటర్ ఇచ్చిన షర్మిల
Vijayasai sharmila

వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల వివాదం గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరియు వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విజయసాయిరెడ్డి ఇటీవల తన వ్యాఖ్యల్లో ఇది Read more

IPL 2025: రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఘన విజయం
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఘన విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా, వరుస విజయాలతో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్‌ మరోసారి సత్తాచాటింది. గురువారం జైపూర్‌లోని సవాయ్‌మాన్‌సింగ్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ Read more

సాయిబాబా మృతి పై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
prof saibaba dies

ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టు పార్టీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి మంగళవారం( అక్టోబర్‌ 15) ఒక ప్రకటన విడుదల చేశారు. Read more

వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో స్మృతి మంధాన
వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో స్మృతి మంధాన

ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన తన అద్భుత ప్రదర్శనతో మహిళల ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంది. మూడు Read more

Advertisements
×