ఇరాన్ యుద్ధ సెగతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ అతలాకుతలమవుతోంది. ముడి చమురు ధరలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరి సామాన్యుడితో పాటు పారిశ్రామిక రంగాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ ఇంధన సరఫరాపై కోలుకోలేని దెబ్బ తీసింది. అంతర్జాతీయ ప్రమాణంగా భావించే బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ధర శనివారం నాటికి బ్యారెల్కు 90 డాలర్ల మార్కును దాటిపోయింది. 2024 ఏప్రిల్ తర్వాత ముడి చమురు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. యుద్ధం ప్రారంభమైన వారం రోజుల్లోనే ధరలు ఏకంగా 25 శాతం పెరగడం గమనార్హం. గతంలో 2020 ఏప్రిల్లో కరోనా సంక్షోభం సమయంలో మాత్రమే ఇలాంటి అసాధారణ మార్పులు కనిపించాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా రవాణా నిలిచిపోవడంతో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Guarantees : కూటమి సర్కార్ మరో కీలక హామీలు అమలుకు సిద్ధం
చమురు ధరలు పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఇరాన్తో చర్చలకు తావులేదని, కేవలం “బేషరతు లొంగుబాటు” (Unconditional Surrender) మాత్రమే పరిష్కారమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగుతుందనే సంకేతాలిచ్చింది. రెండోది, గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు తగ్గకపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచుతోంది. మూడోది, కువైట్ వంటి ప్రధాన చమురు ఉత్పత్తి దేశం తన నిల్వ సామర్థ్యం నిండిపోవడంతో ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ప్రకటించడం మార్కెట్ను మరింత కుదిపేసింది. ఈ పరిణామాల వల్ల భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :