हिन्दी | Epaper
గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు

Gold: ఎన్ఆర్ఐలకు ఊరట.. గోల్డ్ లిమిట్ పై కొత్త రూల్!

Vanipushpa
Gold: ఎన్ఆర్ఐలకు ఊరట.. గోల్డ్ లిమిట్ పై కొత్త రూల్!

గత కొంతకాలంగా విదేశాల్లో నివసించే భారతీయులను (NRIs), ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉండేవారిని వేధిస్తున్న ఒక ప్రధాన సమస్యకు భారత ప్రభుత్వం స్వస్తి పలికింది. కేంద్ర బడ్జెట్ 2026లో భాగంగా బంగారం కస్టమ్స్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల నుండి భారతదేశానికి వచ్చే ప్రయాణికులకు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. 2026 కేంద్ర బడ్జెట్‌ లో బంగారం(Gold)పై ఉన్న పాత కస్టమ్స్ నిబంధనలను సవరించి, సామాన్యులకు ఎంతో ఊరటనిచ్చింది. ఈ మార్పు వల్ల ఎయిర్‌పోర్టుల్లో తనిఖీల సమయంలో ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులు ఇకపై ఉండవని భావిస్తున్నారు.

Read Also: Air india news : Boeing 787 విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో పెను ప్రమాదం

Gold: ఎన్ఆర్ఐలకు ఊరట.. గోల్డ్ లిమిట్ పై కొత్త రూల్!
Gold: ఎన్ఆర్ఐలకు ఊరట.. గోల్డ్ లిమిట్ పై కొత్త రూల్!

పాత నిబంధనలు ఏమిటి?

ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. మహిళలు 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారాన్ని డ్యూటీ ఫ్రీగా (సుంకం లేకుండా) తీసుకురావచ్చు. అయితే ఇక్కడే ఒక మెలిక ఉండేది. ఈ బరువుతో పాటు విలువపై కూడా పరిమితి ఉండేది. పాత అంతకుమించి వాల్యూ ఉన్న బంగారాన్ని తీసుకురావాడానికి లేదు. అయితే బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో 20 గ్రాముల బంగారం విలువ కూడా 50 వేల కంటే ఎంతో ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల ప్రయాణికులు తమ వద్ద ఉన్న నిర్ణీత బరువులోపు బంగారం ఉన్నా.. దాని విలువ పెరిగిపోవడంతో భారీగా ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. కొత్త మార్పుతో కలిగే ప్రయోజనం తాజా బడ్జెట్ నిర్ణయం ప్రకారం.. ప్రభుత్వం వాల్యూ క్యాప్ (Value Cap) ని పూర్తిగా ఎత్తివేసింది. ఇకపై కేవలం బరువును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అంటే మహిళలు 40 గ్రాములు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారాన్ని ఎటువంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు. దీని విలువ ఎంత ఉన్నా సంబంధం లేదు. ఈ నిర్ణయం వల్ల ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులను అనవసరంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్పుతుందని యూఏఈలోని ప్రవాస భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870