వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక రాజధాని నిర్మాణం ఆలస్యమైందని ఏపీ నగర, పట్టణాభివృద్ధిశాఖా మంత్రి పి. నారాయణ(Minister Narayana) తెలిపారు. కాంట్రాక్టర్లుకు బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించేనాటికి వర్షాలు ముంచెత్తాయి. అంతర్జాతీయ రాజధాని నిర్మాణంలో భాగంగా స్మార్ట్ ఇండస్ట్రీలు, అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport), స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సీఎం నిర్ణయించారని వివరించారు.
Read also: Cases of Scrub Typhus : ఏపీ రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్న చిగ్గర్ అనే పురుగు
రహదారి నిర్మాణానికి ప్రణాళికలు

పల్నాడు జిల్లాలో రైతులు ఇచ్చిన భూమిలో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తాం. గతంలో భూ సమీకరణ సమయంలో విధానాలే ఇక్కడా అమలు చేస్తాం. ట్రంకురోడ్లు, ప్రధాన రహదారులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. నాలుగు, ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాం. ఇక్కడ కూడా ఏడాదిలోనే స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం మండలం ?అమరావతి యండ్రాయిలో రెండో విడత భూసమీకరణలో 7 వేల తీసుకుంటున్న ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారాయణ(Minister Narayana) స్పష్టం చేశారు.
రెండో భూసమీకరణ చేపడుతున్న ప్రాంత రైతులతో పల్నాడు జిల్లా యండ్రాయిలో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. యండ్రాయి, వైకుంఠపురం, పెద్దమత్తూరు, కర్లపూడి రైతులతో పాటు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమావేశంలో పాల్గొన్నారు. భూసమీకరణపై రైతుల అభిప్రాయాలను మంత్రి నారాయణ తెలుసుకున్నారు. భూసమీకరణపై రాజధాని రైతుల విషయంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ట్రంకు రోడ్లు, ప్రధాన రహదారులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: