భారత్ – దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. విశాఖ వేదికగా IND-SA మ్యాచ్ మూడో వన్డే జరగనుంది.. రాంచీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించగా, రాయపూర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా భారీ స్కోర్ను ఛేజ్ చేసింది. దాంతో సిరీస్ 1 – 1తో సమం అయింది. ఇక వైజాగ్ వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే అది సిరీస్ సొంతం చేసుకోనుంది.
Read Also: FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ డ్రా విడుదల

ఈరోజు సెంచరీ చేస్తారా?
అయితే, ఈ మ్యాచ్లో అందరి దృష్టి కోహ్లీ (Kohli) పైనే ఉంది. ఇప్పటికే ఈ సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన విరాట్.. ఈరోజు సెంచరీ చేసి హ్యాట్రిక్ సాధిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. విశాఖ పిచ్పై కోహ్లీ (Kohli) కి అద్భుతమైన రికార్డు (7 మ్యాచ్ల్లో 3 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు) ఉంది. చిన్న బౌండరీలు కూడా అనుకూలంగా మారనున్నాయి.
అన్నీ కలిసొస్తే మరో సెంచరీ ఖాయం.టీమిండియా జట్టు అంచనా: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: