అమరవీరుల స్తూపానికి నివాళర్పించి నిరసన తెలిపిన మాజీ సర్పంచ్ ల జెఎసి
హైదరాబాద్ : తెలంగాణ పంచాయతీరాజ్ (Telangana Panchayat Raj) మంత్రి పదవికి గౌరవం దక్కేలాగా గ్రామ పంచాయతీలకు అభివృద్ధికీ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మాజీ సర్పంచ్ ల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఘన్ పార్కులోని అమర వీరులు స్థూపానికి నివాళర్పించి తమ నిరసన తెలిపింది. సిఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసి గ్రామాభి వృద్ధికి తోడ్పడాలని జేఏసి సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ డిమాండ్ చేశారు.
గ్రామస్వరాజ్యానికి తూట్లు పొడిచే విధంగా
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలవుతున్న గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం గాంధీ మహాత్ముడి కలైన గ్రామస్వరాజ్యానికి తూట్లు పొడిచే విధంగా కాంగ్రెస్ పాలన ఉందన్నారు. దేశంలోనే ఇక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ అభివృద్ధి చేసిన సర్పంచులు పెండింగ్ బిల్లులురాకపోవడంతో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వం హత్యలే అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు (For Gram Panchayat workers) సకాలంలో వేత నాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మ హత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా పంచాయతీ సెక్రెటరీ మా బిల్లులు చెల్లించాలి అని వాళ్లు కూడా మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

పంచాయతీరాజ్ శాఖకు నిధులు ఇచ్చి
బిల్లులు చెల్లించాలని అడుగుతే అరెస్టులతో భయపెట్టించడం ఇదే నాప్రజా ప్రభుత్వం ?ఇదే నా ప్రజా పాలనాని ఆయన నిలదీశారు. అధికారంలోకి రాక ముందుకు ఒక మాట అధికారంలోకి వచ్చినాక, మరొక మాట మాట్లాడడం ఈ పాలకుల మాటలు కాదన్నారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖకు నిధులు ఇచ్చి పంచాయతీరాజ్ శాఖకు గౌరవం దక్కించాలన్నారు. ఇప్పటికే గ్రామాలు అపరిశుభ్రత పేరుకు పోయి అంటువ్యాధులు విజృంబించే పరిస్థితులు ఉన్నాయని, గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కేశబోయిన మల్లయ్య అం జయ్యగౌడ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: