బెంగళూరు నగరం ఐటీ హబ్గా పేరుగాంచినప్పటికీ, ఇటీవల కాలంలో జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలు ఆ నగర ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. మహిళలకు సురక్షితంగా భావించే పీజీలలోనూ ఇప్పుడు యువతులు రక్షణలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తాజాగా సుద్దగుంటే పాళ్య పోలీస్స్టేషన్ పరిధిలోని ఒక లేడీస్ పీజీ (Ladies PG) లో లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.సమాచారం ప్రకారం, ఒక అనుమానాస్పద వ్యక్తి పీజీ ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడ నివసిస్తున్న ఒక యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.ఆ తర్వాత,పారిపోయాడు. ఇప్పుడు ఈ సంఘటన ఒక పీజీలో జరిగింది. నిందితుడు పరారీలో ఉన్నాడు.
లైంగిక వేధింపుల చర్య సీసీటీవీ కెమెరాలో రికార్డైంది
ఆగస్టు 29 శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు సుద్దగుంటెపాళ్యంలోని లేడీస్ పీజీలో ఒక యువతి లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిసింది. సుద్దగుంటెపాళ్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. లైంగిక వేధింపుల చర్య సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డైంది. తెల్లవారుజామున 3 గంటలకు నిందితుడు ముసుగు ధరించి, పీజీకి వచ్చి యువతి ఉన్న గదిలోకి దూసుకెళ్లాడు. ఎవరో వచ్చారని ఆ యువతికి తెలుసు, కానీ అది తన రూమ్మేట్ అయి ఉండవచ్చని భావించి ఆమె నిద్రలోనే ఉంది. అయితే ఆ వ్యక్తి గది తలుపులన్నీ మూసివేసి తాళం వేసి లాక్ చేశాడు. తర్వాత యువతి వద్దకు వెళ్లి ఆమె చేతులు, కాళ్లు కట్టేశాడు.

సుద్దగుంటెపాల్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఆ యువతి వెంటనే ప్రతిఘటించింది. అరుస్తూనే ఆ యువతి ఆ అపరిచితుడిని తన్నింది. ఆ వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. తరువాత అతను అల్మారా నుండి రూ.2,500 తీసుకొని వెళ్లిపోయాడు. ఆ యువతి సుద్దగుంటెపాల్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే సంఘటన జరిగి రెండు రోజులు గడిచినా నిందితుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: