తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫ్రీ బస్సు (Free bus) ను మహిళలకు ఇచ్చింది. ఇంకేం మహిళలకు ఇక పండగే పండగ అయ్యింది. చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలకు నిజంగా ఈ ఫ్రీ బస్సు గొప్ప వరప్రసాదిని. చాలీచాలని జీతంతో బతుకులాగుతున్న దినసరి కూలీపనులు చేసుకునే మహిళలకు,ఈ పథకం ఎంతో ఆర్థిక సౌలభ్యతను కలిగించింది. అయితే ప్రారంభంలో తెలంగాణలో ఫ్రీ బస్సు అనగానే మహిళలు విపరీతంగా బస్సుల్లో,ప్రయాణించేవారు. దీంతో సీట్ల కోసం జుట్టుపట్టుకుని ఫైటింగ్ చేసేవారు. పలుచోట్ల మహిళల మధ్య డిష్యుం.. డిష్యుంలు జరిగాయి. వీటికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. కొంతమంది మహిళలు అయితే ఏకంగా డ్రైవర్, కండెక్టర్లపైనే దౌర్జన్యాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి.
ఆంధ్రాలోనూ సేమ్ సీన్ రిపీట్
తాజాగా ఈనెల 15వ తేదీనుంచి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో సిఎం చంద్రబాబు (CM Chandrababu) ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఒకటైన ఉచిత,ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌలభ్యం ఏర్పడింది. ఇంకేం,ఉంది మహిళలు జాతరలా ఉచిత బస్సుల్లో ప్రయాణించడం మొదలు పెట్టారు. అసలు యుద్ధం ఇక్కడే మొదలైంది. బస్సు కెపాసిటీకి మించి మహిళలు బస్సుల్లో ప్రయాణించేసరికి ఇక సీట్లకోసం ఫైటింగ్ లు మొదలయ్యాయి. తాజాగా విజయవాడ నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న బస్సులో సీటు కోసం,మహిళల మధ్య గొడవ జరిగింది. జుట్లు పట్టుకుని కొట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉచిత బస్సు ప్రయాణం ఏమిటో కానీ,రోజు ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు మాత్రం నిత్యం నరకం తప్పడం లేదు. ఆఫీసులకు వెళ్లాలంటే వారికి యాతనగా మారింది. ఇక బస్సు నడిపే డ్రైవర్, కండెక్టర్ల బాధలు వర్ణనాతీతంగా మారింది.ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో.
Read hindi news: hindi.vaartha.com
Read also: