కునాల్ కామ్ర ముందస్తు బెయిలు పొడిగింపు

Kunal Kamra: కునాల్ కామ్ర ముందస్తు బెయిలు పొడిగింపు

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యల ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రకు తాత్కాలిక ఊరట లభించింది. ఆయనకు ఇటీవల మంజూరు చేసిన తాత్కాలిక ముందస్తు బెయిలును మద్రాసు హైకోర్టు సోమవారంనాడు పొడిగించింది. ఏప్రిల్ 17వ తేదీ వరకూ ఈ గడువును పొడిగించింది.
మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన కునాల్ కామ్ర
కునాల్ కామ్ర వివాదాస్పద వ్యాఖ్యలపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆయన ఇటీవల మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయనకు తాత్కాలిక ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఆ గడువు సోమవారంతో ముగియనుండటంతో ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తన వాదన వినిపించారు. కునాల్‌పై మహారాష్ట్రలో మరో 3 కేసులు నమోదైనట్టు తెలియజేశారు. ముంబై పోలీసులు కునాల్‌ పట్ల శతృత్వంతో వ్యవహరిస్తున్నారని, ఆయన తల్లిదండ్రులను కూడా వేధిస్తున్నారని కోర్టుకు తెలిపారు. కాగా, మహారాష్ట్ర పోలీసులు తనకు వ్యతిరేకంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాల్సిం దిగా ముంబై హైకోర్టును కూడా కునాల్ ఆశ్రయించారు. జస్టిస్ సారంగ్ కొత్వాల్‌ సారథ్యంలోని ధర్మాసనం ఏప్రిల్ 8న ఈ కేసు విచారణను చేపట్టనుంది.

Advertisements
కునాల్ కామ్ర ముందస్తు బెయిలు పొడిగింపు

అసలు ఇదీ వివాదం
ముంబైలో ఇటీవల జరిగిన కామెడీ షోలో ఏక్‌నాథ్ షిండేను ప్రస్తావిస్తూ కునాల్ ఒక పేరడీ సాంగ్‌ ప్రదర్శించారు. శివసేనను చీల్చడంలో షిండే పాత్రను ప్రస్తావిస్తూ ‘ద్రోహి’గా ఆయనను అభివర్ణించారు. యూట్యూబ్‌లో ఇందుకు సంబంధించిన వీడియో అప్‌లోడ్ కావడంతో శివసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆ పాటను రికార్డింగ్ చేసిన స్టూడియోను ధ్వంసం చేశారు. కునాల్‌పై శివసేన ఎమ్మెల్యే మురాజీ పటేల్ ఫిర్యాదు చేయడంతో మార్చి 24న ఎఫ్ఐఆర్ నమోదైంది. అ తర్వాత మరో మూడు ఎఫ్ఐఆర్‌లు కునాల్‌పై నమోదయ్యాయి. ఈ కేసులో విచారణాధికారి ముందు హాజరుకావాలంటూ కునాల్‌కు ముంబై పోలీసులు మూడుసార్లు సమన్లు జారీ చేశారు. అయితే కునాల్ విచారణకు గైర్హాజరయ్యారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

Related Posts
రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబం – జగ్గారెడ్డి
Jaggareddy's key comments o

కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ కులంపై బీజేపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని, ఆయన బ్రాహ్మణ Read more

తమిళులకు అమిత్ షా క్షమాపణలు
తమిళులకు అమిత్ షా క్షమాపణలు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష అయిన తమిళాన్ని మాట్లాడలేకపోవడం Read more

ఓ పార్టీలో ట్రంపును కలిసిన అంబానీ జంట
trump and muskesh couple

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు 2వ సారి పదవీ బాధ్యతలు చేపట్టనున్న సంగతి మీకు తెలిసిందే. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత Read more

జనవరిలో 100వ మిషన్‌ ప్రయోగం: ఇస్రో చీఫ్‌
100th mission launch in January.. ISRO chief

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 2025లో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ) ఎన్‌వీఎస్-02 ప్రయోగం చేపట్టనున్నది. ఈ మిషన్‌ కోసం సన్నాహాలు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×