DonaldTrump :కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి నావంతు సాయం చేస్తా: ట్రంప్

Trump U Turn : విదేశీ విద్యార్థుల‌ విషయంలో ట్రంప్ వెనకడుగు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థుల విషయంలో తీసుకున్న వీసా రద్దు నిర్ణయంపై చివరికి వెనక్కి తగ్గారు. వీసాలు రద్దు చేసిన ట్రంప్ చర్యను వ్యతిరేకిస్తూ విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో, కోర్టులు విద్యార్థుల పక్షాన తీర్పులు వెలువరించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కారు విదేశీ విద్యార్థుల వీసాల రద్దును తాత్కాలికంగా నిలిపివేసి, వారి చట్టబద్ధ హోదాను పునరుద్ధరించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Advertisements

న్యాయస్థానాల ఆదేశాలతో ట్రంప్ వెనకడుగు

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న వీసా రద్దు నిర్ణయంతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థులు బహిష్కరణ ముప్పును ఎదుర్కొన్నారు. తమ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయిన విద్యార్థులు కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణలో న్యాయస్థానాలు విద్యార్థుల పక్షాన నిలిచి, ప్రభుత్వాన్ని కఠినంగా మందలించాయి.

విదేశీ విద్యార్థుల్లో ఆనందం

వీసా రద్దుతో అమెరికాలోని అనేక మంది విదేశీ విద్యార్థులు ఆందోళనకు గురై, కొందరు దేశం విడిచిపెట్టగా, మరికొందరు రహస్య ప్రదేశాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. తాజా కోర్టు తీర్పుతో ట్రంప్ వెనక్కి తగ్గిన వార్త విదేశీ విద్యార్థుల్లో భారీగా ఆనందం కలిగించింది. చట్టబద్ధ హోదా తిరిగి లభించడంతో వారి భవిష్యత్‌పై నెలకొన్న అనిశ్చితి కొంతవరకు తొలగింది. ప్రస్తుతం ఈ పరిణామాలతో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులకు ఊరట లభించినట్టైంది.

Read Also : Shruti Hasan: అమ్మా నాన్న విడిపోవడం నా జీవితంలో బాగా బాధపెట్టిన సంఘటన: శ్రుతి హాసన్

Related Posts
Obulapuram : ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా పలువురికి 7 ఏళ్ల జైలు శిక్ష,
Obulapuram : ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా పలువురికి 7 ఏళ్ల శిక్ష,

ఉమ్మడి ఎపిలో సంచలనం సృష్టించిన ఓబుళాపురం గనుల అక్రమ మైనింగ్ కేసులో 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత నాంపల్లి సిబిఐ కోర్టు మంగళవారం నాడు సంచలన Read more

Bandi Sanjay: ఉద్యోగాల పేరిట మయన్మార్‌కు తరలింపు..బండి సంజయ్ చొరవతో స్వదేశానికి చేరిక
ఉద్యోగాల పేరిట మయన్మార్‌కు తరలింపు..బండి సంజయ్ చొరవతో స్వదేశానికి చేరిక

బ్యాంకాక్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మయన్మార్‌లో సైబర్ ఉచ్చులో చిక్కుకుపోయిన ముగ్గురు తెలంగాణ వాసులు, ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్వదేశానికి Read more

Chandrababu : నేడు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు
టిడిపిని లేకుండా చేయాలనుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలంలోని కొత్తగొల్లపాలెంలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల Read more

Rushikonda Palace : రుషికొండ ప్యాలెస్‌పై చంద్రబాబు ఫోకస్
CBN Rushikonda

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలోని రుషికొండ భవనాల భవితవ్యంపై కీలకంగా ఆలోచిస్తోంది. వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనాలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై సీఎం నారా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×