100th mission launch in January.. ISRO chief

జనవరిలో 100వ మిషన్‌ ప్రయోగం: ఇస్రో చీఫ్‌

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 2025లో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ) ఎన్‌వీఎస్-02 ప్రయోగం చేపట్టనున్నది. ఈ మిషన్‌ కోసం సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది ప్లాన్‌ చేసిన పలు మిషన్‌లో జీఎస్‌ఎల్‌వీ మిషన్‌ ఒకటని ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ తెలిపారు. ఇస్రో సోమవారం రాత్రి విజయవంతంగా స్పాడెక్స్‌ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సోమ్‌నాథ్‌ ఈ ప్రకటన చేశారు.

మే 29, 2023న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 రాకెట్ ఎన్‌ఎస్‌వీ-01 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టిందని సోమ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఎన్‌వీఎస్‌-04 ఉపగ్రహంలో స్వదేశీ అటామిక్‌ క్లాక్‌ ఉంటుందన్నారు. ఇది ఇండియన్‌ కాన్స్టెలేషన్‌ (NAVIC)తో నావిగేషన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. కవరేజ్‌ కోసం ఎల్‌1 బ్యాండ్‌ సిగ్నల్‌ కలిగి ఉంటుందన్నారు. ఎన్‌వీఎస్‌-2 మిషన్‌తో మరింత పురోగతి సాధించాలని భావిస్తున్నామన్నారు. అధునాతన ఫీచర్స్‌తో నావిక్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.

ఇస్రో చీఫ్‌ ఈ సందర్భంగా చంద్రయాన్‌-4 మిషన్‌పై కీలక సమాచారాన్ని వెల్లడించారు. మిషన్‌లో వివిధ మాడ్యూల్స్‌ ఉంటాయని.. వేర్వేరు సమయాల్లో ప్రయోగించనున్నట్లు తెలిపారు. రెండు వేర్వేరు మాడ్యూల్స్‌లో ఒకేసారి కలుపనున్నట్లు తెలిపారు. ఈ మాడ్యూల్స్‌ కక్షలోకి చేరుకోవాల్సి ఉంటుందని.. ఆ తర్వాత భూమి కక్ష్య, చంద్రుడి కక్ష్యలో రెండింటిలోనూ డాక్‌ చేయాల్సి ఉంటుందన్నారు. చంద్రుడిపై దిగి విజయవంతంగా తిరిగి రావడమే చంద్రయాన్-4 లక్ష్యమని సోమ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

Related Posts
సచివాలయాన్ని ముట్టడించిన బెటాలియన్‌ కానిస్టేబుల్ కుటుంబాలు
families of the battalion constables who besieged the secretariat

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని జిల్లాల్లో కొన్ని రోజులుగా సాగుతున్న బెటాలియన్‌ పోలీసుల కుటుంబాల ఆందోళనలు హైదరాబాద్‌ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు రాష్ట్రంలో కానిస్టేబుల్‌ భార్యలు తమ Read more

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా – బీఏసీ భేటీలో హాట్ టాపిక్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా – బీఏసీ భేటీలో హాట్ టాపిక్స్

ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా – గవర్నర్ ప్రసంగం, వైసీపీ వాకౌట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. శాసనసభ మరియు శాసనమండలిని ఉద్దేశించి Read more

పాక్ చొరబాటుదారుడిని కాల్చి చంపిన భద్రతా దళం
పాక్ చొరబాటుదారుడిని కాల్చి చంపిన భద్రతా దళం

పంజాబ్‌లోని పఠాన్‌కోట్ సరిహద్దులో బుధవారం తెల్లవారుజామున సరిహద్దు భద్రతా దళం (BSF) సైనికులు ఒక పాకిస్థాన్ చొరబాటుదారుడిని కాల్చి చంపారు. ఈ ఘటన భారత్-పాక్ సరిహద్దులో భద్రతా Read more

పసిడి దిగుమతుల ఆల్ టైమ్ రికార్డ్
GoldNov

భారత లో పసిడి దిగుమతులు నవంబర్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నవంబర్ లో 14.8 బిలియన్ డాలర్ల పసిడి దిగుమతులు నమోదు కావడం గమనార్హం. కానీ Read more