हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

కేటీఆర్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు

sumalatha chinthakayala
కేటీఆర్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో క్వాష్ పిటిషన్‌ను కేటీఆర్ వెనక్కి తీసుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను వేశారు. దీనిపై ఈరోజు (బుధవారం) సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు రాగా.. కాసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంలో కేటీఆర్‌కు నిరాశే ఎదురైంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది.

image
image

విచారణలో భాగంగా కేటీఆర్ తరపున న్యాయవాది సిదార్థ వాదనలు వినిపించారు. ఈ ఫార్ములా కారు రేసు కేసులో హెచ్‌ఎండీఏను, ఇతరులను పేర్కొనలేదని కేవలం ఇద్దరు అధికారులను, కేటీఆర్‌ను మాత్రమే నిందితులుగా చేర్చారని కోర్టు ముందు ప్రస్తావించారు. వెంటనే జోక్యం చేసుకున్న జస్టిస్ బేలా త్రివేది.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కాస్త ఊరట లభిస్తుందని భావించిన కేటీఆర్‌కు ఎదురుదెబ్బే తగిలింది. సుప్రీం నిర్ణయంతో ఈ కేసులో ఏసీబీకి మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది.

అయితే కేటీఆర్‌ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంలో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. విచారణ సందర్భంగా ముందు తమ వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం కేవియట్‌ పిటిషన్‌ను ముందస్తుగానే దాఖలు చేసింది. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్ నిరాకరణకు గురైనప్పటికీ.. సుప్రీం స్టే విధిస్తుందని కేటీఆర్‌ భావించినట్లు తెలుస్తోంది. కానీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌లో తాము జోక్యం చేసుకునేదని లేదని సుప్రీం దర్మాసనం తేల్చిచెప్పడంతో ఏసీబీ మరోసారి నోటీసులు ఇస్తే ఆ విచారణకు కేటీఆర్ ఖచ్చితంగా హాజరుకావాల్సి ఉంటుంది. గతంలో ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌ను దాదాపు ఎనిమిది గంటల పాటు ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీం కోర్టులో కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ డిస్మిస్ అయిన నేపథ్యంలో.. మాజీ మంత్రి అరెస్ట్‌ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌తో పాటు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్‌ను ఈడీ, ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. వీరి నుంచి పలు కీలక సమాచారాన్ని ఏసీబీ, ఈడీ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మృతి

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మృతి

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

హైదరాబాద్ సందడి మెస్సీ మ్యాచ్‌లో CM రేవంత్ రెడ్డి గోల్…

హైదరాబాద్ సందడి మెస్సీ మ్యాచ్‌లో CM రేవంత్ రెడ్డి గోల్…

న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల పోలీస్…

న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల పోలీస్…

పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

ఈనెల 16 నుంచి యాదగిరిగుట్ట లో ధనుర్మాసోత్సవాలు

ఈనెల 16 నుంచి యాదగిరిగుట్ట లో ధనుర్మాసోత్సవాలు

రూ.125 కోట్ల విలువైన గల్ఫ్‌స్ట్రీమ్ V జెట్‌లో మెస్సీ ప్రయాణం..

రూ.125 కోట్ల విలువైన గల్ఫ్‌స్ట్రీమ్ V జెట్‌లో మెస్సీ ప్రయాణం..

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

📢 For Advertisement Booking: 98481 12870