KTR meets former Governor Narasimhan in Chennai

KTR : చెన్నైలో మాజీ గవర్నర్ నరసింహన్ను కలిసిన కేటీఆర్

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను కలిశారు. చెన్నైలోని వారి నివాసంలో కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి శాలువతో కప్పి సత్కరించి.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని బహుకరించారు.ఈ భేటీలో కేటీఆర్‌తో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఉన్నారు.

Advertisements
చెన్నైలో మాజీ గవర్నర్ నరసింహన్ను

రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా

కాగా, కేసీఆర్ కు తుంటి విరిగినప్పుడు మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు నందినగర్ లోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ రాష్ట్రం విడిపోయాక కూడా గవర్నర్ గా కొనసాగారు. 2014 నుంచి 2019 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగారు. మాజీ గవర్నర్ కృష్ణకాంత్‌ను అధిగమించి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం పనిచేసిన గవర్నర్‌గా నరసింహన్ నిలిచారు.

దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుంది

కాగా, చెన్నైలో నిర్వ‌హించిన డీలిమిటేష‌న్ స‌ద‌స్సులో కేటీఆర్ పాల్గొని.. డీలిమిటేషన్ వలన దక్షిణాదికి జరగనున్న నష్టాన్ని అద్భుతంగా తెలియచెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. నిధులు కేంద్రీకృతం కావడంతో పాటు ఆర్థిక నియంతృత్వానికి దారి తీస్తుందని దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని కేటీఆర్ వివరించారు. దేశం ప్రజాస్వామిక దేశమైనా భిన్న అస్తిత్వాలు, సంస్కృతులు కలిగిన ఒక సమాఖ్య రాష్ట్ర అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాల‌న్నారు.

Related Posts
Ayodhya : అయోధ్య రామాలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడ
4 km long protective wall around Ayodhya Ram temple

Ayodhya: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడను నిర్మించాలని నిర్ణయించారు. ఇది 18 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. శ్రీరామ జన్మభూమి ఆలయ Read more

తెలంగాణ 10వ తరగతి హాల్‌టికెట్లు విడుదల
Telangana 10th class hall tickets released

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్. 2025 టెన్త్‌ క్లాస్‌ పబ్లిక్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ హాల్ టికెట్లు Read more

విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం – బొత్స సత్యనారాయణ
botsa fire

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలపై రూ.15,000 Read more

ఉప ఎన్నిక విషయంలో హీరో విజయ్‌ కీలక నిర్ణయం
Hero Vijay's key decision regarding the by-election

తమిళనాడులో ఈరోడ్ తూర్పు ఉప ఎన్నికల విషయంలో ప్రముఖ నటుడు విజయ్‌ నేతృత్వంలోని తమిఝగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×