KTR hunger strike to death..MP Chamala counters

కేటీఆర్ అమరణ నిరాహార దీక్ష..ఎంపీ చామల కౌంటర్

హైదరాబాద్‌: స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కేటీఆర్‌కు దళితులపై ఎంత ప్రేమ ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం దళితులకు విలువ ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు స్పీకర్‌ను ఆ పార్టీ అవమానించిందన్నారు.

Advertisements
కేటీఆర్ అమరణ నిరాహార దీక్ష

దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు

పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న మీరు స్పీకర్‌కు ఇస్తున్న విలువ ఏంటో తెలుసుకోవాలి. దళిత స్పీకర్‌ను అవమానించి, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేస్తాననడం సిగ్గుచేటు. కేటీఆర్‌కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు. రెచ్చగొట్టేలా మాట్లాడి అసెంబ్లీని స్తంభింపజేస్తున్నారు అని చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. ఉద్యమం టైం నుండే మీ నాయన దళితులను మోసం చేస్తున్నాడు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సార్లు దళితులను అవమానించారు. ఆనాడు నామ మాత్రంగా రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని చేసి బర్తరఫ్ చేశారు. కారణాలు ఏంటో ఇప్పటికీ చెప్పలేదు అని ఎంపీ వెల్లడించారు.

స్పీకర్ మీద కూడా సీరియస్

కాగా, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపే సందర్బంగా శాసనసభలో గందగోళం నెలకొన్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంట్రీ చేయడంపై ఆయన గరం అయ్యారు. ఈ క్రమంలోనే స్పీకర్ మీద కూడా సీరియస్ అయ్యారు. దీంతో ఆయన్ను సభ నుంచి ఈ సెషన్ మొత్తం సస్పెన్షన్ వేటు పడింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆమరణ నిరహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు.

Related Posts
మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం!
International Day for the Elimination of Violence against Women

ప్రతి సంవత్సరం నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకూ, ప్రపంచవ్యాప్తంగా "మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం" (International Day for the Elimination of Read more

భారతదేశంలో 80% మందికి వాతావరణ మార్పులతో ఆరోగ్య ముప్పులు
climate change

భారతదేశంలో 80% కంటే ఎక్కువ మంది వాతావరణ మార్పులతో సంబంధిత ఆరోగ్య ముప్పులకు గురవుతున్నారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాజీ ముఖ్య శాస్త్రజ్ఞురాలు డాక్టర్ సౌమ్య Read more

Sitaramula Kalyanam : 11న ఒంటిమిట్టకు చంద్రబాబు దంపతులు
Chandrababu and his wife will visit Vontimitta on the 11th

Sitaramula Kalyanam : వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ఒంటిమిట్టలో ఈ నెల 11న జరగనున్న కోదండరామస్వామి కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. తన సతీమణి భువనేశ్వరి, Read more

ఏపీలో నేటి నుంచి బడ్జెట్‌పై చర్చ
Discussion on budget from today in AP

అమరావతి: ఏపీలో ఈరోజు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి శాసనసభలో పద్దుపై చర్చ జరుగనుంది. తొలుత పాలవలస రాజశేఖరం మృతికి నివాళులర్పించనున్నారు. Read more

Advertisements
×