KTR hunger strike to death..MP Chamala counters

కేటీఆర్ అమరణ నిరాహార దీక్ష..ఎంపీ చామల కౌంటర్

హైదరాబాద్‌: స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కేటీఆర్‌కు దళితులపై ఎంత ప్రేమ ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం దళితులకు విలువ ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు స్పీకర్‌ను ఆ పార్టీ అవమానించిందన్నారు.

కేటీఆర్ అమరణ నిరాహార దీక్ష

దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు

పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న మీరు స్పీకర్‌కు ఇస్తున్న విలువ ఏంటో తెలుసుకోవాలి. దళిత స్పీకర్‌ను అవమానించి, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేస్తాననడం సిగ్గుచేటు. కేటీఆర్‌కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు. రెచ్చగొట్టేలా మాట్లాడి అసెంబ్లీని స్తంభింపజేస్తున్నారు అని చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. ఉద్యమం టైం నుండే మీ నాయన దళితులను మోసం చేస్తున్నాడు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సార్లు దళితులను అవమానించారు. ఆనాడు నామ మాత్రంగా రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని చేసి బర్తరఫ్ చేశారు. కారణాలు ఏంటో ఇప్పటికీ చెప్పలేదు అని ఎంపీ వెల్లడించారు.

స్పీకర్ మీద కూడా సీరియస్

కాగా, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపే సందర్బంగా శాసనసభలో గందగోళం నెలకొన్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంట్రీ చేయడంపై ఆయన గరం అయ్యారు. ఈ క్రమంలోనే స్పీకర్ మీద కూడా సీరియస్ అయ్యారు. దీంతో ఆయన్ను సభ నుంచి ఈ సెషన్ మొత్తం సస్పెన్షన్ వేటు పడింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆమరణ నిరహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు.

Related Posts
కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కన్నుమూత
indrasena reddy dies

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కన్నుమూయడం ఆ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస Read more

ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పులు..ఇద్దరు మావోయిస్టుల మృతి
2 Maoists Dead In Chhattisgarh Encounter

కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టు Read more

ఎమ్మెల్సీగా విజయశాంతి.. నామినేషన్ కు వచ్చిన రేవంత్ రెడ్డి
ఎమ్మెల్సీగా విజయశాంతి.. నామినేషన్ కు వచ్చిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేల కోటా ద్వారా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించి, నామినేషన్ దాఖలు చేసింది. ఈ Read more

అమెరికా విద్యాశాఖ మంత్రిగా లిండా మెక్‌మహన్‌ నియామకం
Linda McMahon appointed as US Secretary of Education

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన టీమ్‌ను రెడీ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు నియామకాలు పూర్తి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *