ktr comments on congress government

కరెంటు కోతల కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతుంది: కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పై మరోసారి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. కరెంటు కోతల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నదని అన్నారు. విద్యుత్‌ సరఫరాకు గ్యారంటే లేదు కానీ.. షాకులు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే చార్జీలు పెంచి జనంపై భారం మోపేందుకు రెడీ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క గ్యారంటీ సరిగ్గా అమలు చేసిందన్నారు. ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటు వెళ్లాయని ప్రశ్నించారు. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలేనని ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేశారు. ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే. గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉంది. జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా. ఒక్క గ్యారెంటీ సక్కగా అమలు చేసింది లేదు. 420 హామీలకు అతీ గతీ లేదు. మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు. 9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటుబాయే?. మళ్లీ ఈ నడ్డి విరిగే వడ్డనలు ఎందుకు?. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలే’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Advertisements
Related Posts
Pawan Kalyan : కుమారుడు పై స్పందించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan కుమారుడు పై స్పందించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ వార్త వెలువడే Read more

Harish Rao: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
Harish Rao: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారిపోతున్న ఈ కాలంలో, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. గజ్వేల్ పట్టణంలోని శోభా Read more

Hydraa : కొత్తకుంట చెరువును పరిశీలించిన హైడ్రా
hydraa kottakunta

హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ నగరంలోని పలు చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖాజాగూడలోని కొత్తకుంట చెరువును సందర్శించి, చెరువు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో Read more

అశ్వినీ వైష్ణవ్‌కు పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
ఉత్తర తెలంగాణ భక్తుల కోసం ప్రత్యేక రైలు? అశ్వినీ వైష్ణవ్‌కు పొన్నం ప్రభాకర్ లేఖ

తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ - తిరుపతి రైలును ప్రతిరోజు నడిపేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి పొన్నం Read more

Advertisements
×