KTR comes forward for organ donation

KTR: అవయవ దానానికి ముందుకు వచ్చిన కేటీఆర్

KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అవయ దానానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకు వచ్చారు. శాసనసభలో అవయవదానం బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై జరిగిన చర్చలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవయవ దానానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు. నియోజకవర్గాల్లోనూ అవయవదానంపై చైతన్యం తేవాలని చెప్పారు.

అవయవ దానానికి ముందుకు వచ్చిన

అవయవదానంపై మెుదటి సంతకం నేనే చేస్తా

ప్రజలకు అవయవదానంపై అవగాహన కల్పించాలని తెలిపారు. సభ్యులు ముందుకు వస్తే అసెంబ్లీలోనే సంతకాలు చేద్దామన్నారు. అవయవదానంపై మెుదటి సంతకం తానే చేస్తానని వెల్లడించారు. అవయవదానం గొప్ప మానవీయ చర్య అని, మరింత మందికి జీవితాన్నిస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇక, అవయవదానం బిలుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అవయవదానంపై పెట్టిన బిల్లు ఎంతో ఉపయోగకరమని.. అభినందనలు తెలుపుతున్నామన్నారు. నాకున్న సమాచారం మేరకు ఈరోజు వరకు 3724 మంది అవయవదానం కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు.

ఈ బిల్లు వీరందరికీ ఎంతో ఊరట చెందే విషయం

ఈ రోజు పెట్టిన బిల్లు వీరందరికీ ఎంతో ఊరట చెందే విషయం. ఈ బిల్లు ద్వారా గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్‌కు అవయవదానం చేసే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా స్వాప్ ద్వారా పరస్పరం అవయవ దానం చేసుకునే అవకాశం కలుగుతుంది. అవయవాల మార్పిడి దందా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవచ్చు అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని న్యూరో ఫిజీషియన్లు మాత్రమే నిర్థారించే వారు. ఈ బిల్లు ద్వారా డాక్టర్లందరూ నిర్ధారణ చేసే అవకాశం కల్పించారు. దీంతో త్వరగా నిర్థారణ చేసి, అవయవ దానం చేసే అవకాశం కలుగుతుంది. జీవన్ దాన్ ప్రోగ్రాం విజయవంతంగా జరిగింది.

Related Posts
తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డ్డ‌వారికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం
Vaikuntha Darshan for those injured in the stampede

తిరుపతి: తిరుప‌తిలో వైకుంఠ ఏకాద‌శి ద్వార ద‌ర్శ‌నం టోకెన్ల జారీ స‌మ‌యంలో జ‌రిగిన తొక్కిస‌లాటలో ఆరుగురు మృతిచెంద‌గా, అనేక మంది గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే ఈరోజు Read more

హైడ్రాలో డీఆర్ఎఫ్ పాత్ర చాలా కీలకం: రంగనాథ్
DRF role in HYDRA is crucial.. Ranganath

హైదరాబాద్‌: హైడ్రా నిర్వ‌హిస్తున్న విధుల‌న్నిటిలో డీఆర్ఎఫ్ బృందాల పాత్ర చాలా కీల‌క‌మైన‌ద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ అన్నారు. ప్ర‌భుత్వ ల‌క్ష్యాలు, ప్ర‌జ‌ల అంచ‌నాల మేర‌కు హైడ్రా Read more

భావ తీవ్రత ఉన్నందుకే పోరాట యాత్ర చేసాం – పవన్
pawan janasena

జనసేన పార్టీ స్థాపన వెనుక ఉన్న అసలైన కారణాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వెల్లడించారు. 2014లో పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ, రాజకీయాల్లో పూర్తిస్థాయిలో ప్రజాసమస్యలపై Read more

International University : ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ వర్సిటీ.. ఒప్పందం ఖరారు
Uttarandhra International U

ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయం స్థాపనకు అవకాశం ఏర్పడింది. రాష్ట్ర Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *