Koil Alwar Thirumanjanam in Tirumala according to scriptures

TTD : తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

TTD : తిరుమల శ్రీవారి ఆలయంలో తెలుగు నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని అన్నారు. శ్రీవారి ఆలయంలో ఉత్సవాలకు ముందు మంగళవారం తిరుమంజనం చేయడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.

తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్

మూలమూర్తికి ప్రత్యేక పూజలు

ఉగాది, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఆణివార ఆస్థానం తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తామని, ఆలయ ప్రాంగణం, ఆలయ గోడలు, ఆలయ పైకప్పు, దేవత మూర్తులు, పూజ సామాగ్రిని శుద్ధి చేశామని వివరించారు. మూలమూర్తిపై వస్త్రం కప్పి సుగంధ ద్రవ్యాలతో ఆలయ మొత్తం సంప్రోక్షణ చేశామని కార్యక్రమం అనంతరం మూలమూర్తికి ప్రత్యేక పూజలు, నివేదనలు అర్చకులు సమర్పిస్తారని ఈవో తెలిపారు.

image

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ అధకారులు రద్దు చేశారు. 25వ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు స్వీకరించబడవని అధికారులు తెలియజేశారు. 30న ఉగాది ఆస్థానం ఉంటుందని పేర్కొన్నారు.

Related Posts
హైదరాబాద్ లో సస్టైనబల్ ఉన్నత విద్య కోసం యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్, సిమెన్స్, మరియు టి -హబ్ భాగస్వామ్యం
University of East London Siemens and T Hub partnership for sustainable higher education in Hyderabad

హైదరాబాద్ : యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ (యుఈఎల్), సిమెన్స్ యుకె మరియు టి -హబ్ హైదరాబాద్‌ సంయుక్తంగా 13 నవంబర్ 2024న సస్టైనబిలిటీ ని ముందుకు Read more

మోడీతో గూగుల్ CEO భేటీ – డిజిటల్ ఇండియాకు మద్దతుగా గూగుల్
మోడీతో సుందర్ పిచాయ్ భేటీ: భారత్ డిజిటల్ భవిష్యత్తుపై కీలక చర్చలు

మోడీతో సుందర్ పిచాయ్ భేటీ: భారత్ డిజిటల్ భవిష్యత్తుపై కీలక చర్చలు భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మధ్య జరిగిన Read more

వారి ఖాతాల్లోకి రూ.20 వేలు:మంత్రి కీలక ప్రకటన
వారి ఖాతాల్లోకి రూ.20 వేలు:మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు, మత్స్యకారులు, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మత్స్యకారులకు మత్స్యకార భరోసా, రైతులకు అన్నదాత సుఖీభవ, విద్యార్థులకు తల్లికి వందనం వంటి పథకాలు Read more

నేడు ఢిల్లీలో 101 మంది పంజాబీ రైతుల ర్యాలీ
101 Punjab farmers rally in Delhi today

న్యూఢిల్లీ: ఈరోజు మూడోసారి ఢిల్లీకి పంజాబీ రైతులు ర్యాలీ తీయ‌నున్నారు. శంభూ బోర్డ‌ర్ నుంచి 101 మంది రైతులు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *