हिन्दी | Epaper

Kodanda Reddy: రాష్ట్రంలో ఉద్యానపంటల సాగు పెరగాలి – రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

Sharanya
Kodanda Reddy: రాష్ట్రంలో ఉద్యానపంటల సాగు పెరగాలి – రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో ఉద్యాన పంటల (Horticultural crops) సాగు పెరగాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి (Kodanda Reddy) అన్నారు. ముఖ్యంగా కూరగాయల పంటల సాగు పెంచాలని చెప్పారు. రాష్ట్రానికి ప్రతీ రోజు లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు దిగుమతిని అవుతున్నాయని, వాటిని తగ్గించాలంటే రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు పెరగాలని స్పష్టం చేశారు.

Kodanda Reddy
Kodanda Reddy

రాష్ట్రంలో 60 మంది హర్టికల్చర్ అధికారులు

హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంటల సాగు విస్తీర్ణం (Crop cultivation area) పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఉద్యానవన శాఖలో ఉద్యోగుల కొరత, కూరగాయల సాగు చేసే రైతులకు ఎదురవుతున్న సమస్యలపై అధికారులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా గత కొన్నేళ్లుగా ఉద్యానవన శాఖలో ఉద్యోగాల భర్తీ కాకపోవడం, పనిభారం పెరిగిన విషయాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది హర్టికల్చర్ అధికారులే ఉన్నారని దీంతో రైతులకు ఉద్యానవన పంటల సాగుపై అవగాహాన కల్పించ లేకపోతున్నట్లు తెలిపారు. మార్కెట్లు అందుబాటులో లేకపోవడం, ఉద్యానవన పంటల సాగులో ఆధునిక పద్ధతులు, యంత్ర పరికరాలు వినియోగించక పోవడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని వారు వివరించారు. అలాగే ఎలాంటి నష్టం లేని పంట పట్టు పురుగుల సాగని, దీన్ని ప్రోత్సహిస్తే రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈసమావేశంలో కమిషన్ సభ్యులు భవానిరెడ్డి, గంగాదర్, సిహెచ్ వెంకన్న, ఉద్యనశాఖ అధికారుల సందీప్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Andela Sriramulu Yadav: బిజెపి నేత ఇంటి వద్ద రోహింగ్యాల అనుమానాస్పద సంచారం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870