Kishan Reddy on a hasty visit to Delhi

Kishan Reddy : హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు కిషన్‌రెడ్డి

Kishan Reddy : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. షెడ్యూలు ప్రకారం సికింద్రాబాద్‌లో సాయంత్రం జరిగే బిహార్‌ దివస్‌లో ఆయన పాల్గొనాల్సి ఉండగా.. దాన్ని రద్దు చేసుకొని హస్తినకు వెళ్లారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు జరుగుతున్న క్రమంలో ఉన్నపళంగా ఆయన ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ విధంగా కార్యక్రమాన్ని రద్దు చేసుకొని కిషన్ వెళ్లి ఉంటారనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఆ కీలక అంశం ఏమిటి ? తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక విషయమా ? బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో కిషన్ రెడ్డి ఉన్న విషయమా ? వక్ఫ్ బిల్లు విషయమా ? దక్షిణాది రాష్ట్రాలను కుదిపేస్తున్న నియోజకవర్గాల పునర్విభజన అంశమా ? అనేది తెలియాల్సి ఉంది.

Advertisements
హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు కిషన్‌రెడ్డి

ఆయా అంశాలపై చర్చించేందుకు

ఇక, ఇతరత్రా కారణాలతోనూ ఢిల్లీకి కిషన్ రెడ్డి వెళ్లి ఉండొచ్చు. నేటి(సోమవారం) నుంచి కీలకమైన పార్లమెంటు సెషన్ జరగబోతోంది. ఇందులో వక్ఫ్ సహా పలు అంశాలకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రాధాన్యమున్న బిల్లులపై ఓటింగ్, చర్చ వంటివి ఉన్నప్పుడు తప్పకుండా కేంద్ర మంత్రులు పార్లమెంటులో అందుబాటులో ఉండాలి. ఆయా అంశాలపై చర్చించేందుకు మంత్రి మండలి సమావేశాలు సైతం జరుగుతుంటాయి. వివిధ అంశాలపై లోక్‌సభ‌లోని విపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. బహుశా అందుకే కిషన్ రెడ్డి ఢిల్లీకి హుటాహుటిన వెళ్లి ఉంటారని కొందరు అంటున్నారు.

Related Posts
Telangana: కూతుర్ని ప్రేమించాడని గొడ్డలితో నరికి చంపిన తండ్రి
Telangana: మరో పరువు హత్య! కూతుర్ని ప్రేమించాడని యువకుడిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి

తెలంగాణలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. కులాలు వేరు కావడం వల్ల ప్రేమను అంగీకరించని తండ్రి, కూతురి ప్రియుడిపై పెత్తనం చెలాయించి అతని ప్రాణం తీశాడు. Read more

రైలు హైజాకర్లను అంతమొందించిన ఆర్మీ..బందీలకు విముక్తి!
రైలు హైజాకర్లను అంతమొందించిన ఆర్మీ..బందీలకు విముక్తి!

పాకిస్థాన్‌లో రైలు హైజాక్ చేసిన మిలిటెంట్లను పాక్ సైనికులు అంతమొందించారు. బందీలుగా ఉన్న ప్రయాణికులను కాపాడారు. అయితే, ఈ ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులతోపాటు నలుగురు Read more

Infosys: ఇంటర్నల్ అసెస్మెంట్ క్లియర్ చేయని 240 మందిని తొలగించిన ఇన్ఫోసిస్
ఇంటర్నల్ అసెస్మెంట్ క్లియర్ చేయని 240 మందిని తొలగించిన ఇన్ఫోసిస్

భారతదేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్ ఇంటర్నల్ అసెస్మెంట్ క్లియర్ చేయని 240 మంది ఎంట్రీ-లెవల్ ఉద్యోగులను తాజాగా తొలగించింది. మనీకంట్రోల్ ప్రకారం ఏప్రిల్ 18న Read more

Registration : ఇక పై తెలంగాణలో 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తి
Registration can now be completed within 10 minutes in Telangana

Registration : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం ప్రజ‌ల‌కు వేగంగా స‌మ‌ర్ధవంతమైన, పారద‌ర్శకంగా సేవ‌లందించేలా చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని సబ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×