Kishan Reddy on a hasty visit to Delhi

Kishan Reddy : హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు కిషన్‌రెడ్డి

Kishan Reddy : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. షెడ్యూలు ప్రకారం సికింద్రాబాద్‌లో సాయంత్రం జరిగే బిహార్‌ దివస్‌లో ఆయన పాల్గొనాల్సి ఉండగా.. దాన్ని రద్దు చేసుకొని హస్తినకు వెళ్లారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు జరుగుతున్న క్రమంలో ఉన్నపళంగా ఆయన ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ విధంగా కార్యక్రమాన్ని రద్దు చేసుకొని కిషన్ వెళ్లి ఉంటారనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఆ కీలక అంశం ఏమిటి ? తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక విషయమా ? బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో కిషన్ రెడ్డి ఉన్న విషయమా ? వక్ఫ్ బిల్లు విషయమా ? దక్షిణాది రాష్ట్రాలను కుదిపేస్తున్న నియోజకవర్గాల పునర్విభజన అంశమా ? అనేది తెలియాల్సి ఉంది.

హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు కిషన్‌రెడ్డి

ఆయా అంశాలపై చర్చించేందుకు

ఇక, ఇతరత్రా కారణాలతోనూ ఢిల్లీకి కిషన్ రెడ్డి వెళ్లి ఉండొచ్చు. నేటి(సోమవారం) నుంచి కీలకమైన పార్లమెంటు సెషన్ జరగబోతోంది. ఇందులో వక్ఫ్ సహా పలు అంశాలకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రాధాన్యమున్న బిల్లులపై ఓటింగ్, చర్చ వంటివి ఉన్నప్పుడు తప్పకుండా కేంద్ర మంత్రులు పార్లమెంటులో అందుబాటులో ఉండాలి. ఆయా అంశాలపై చర్చించేందుకు మంత్రి మండలి సమావేశాలు సైతం జరుగుతుంటాయి. వివిధ అంశాలపై లోక్‌సభ‌లోని విపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. బహుశా అందుకే కిషన్ రెడ్డి ఢిల్లీకి హుటాహుటిన వెళ్లి ఉంటారని కొందరు అంటున్నారు.

Related Posts
Bill Gates : నేడు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ
Bill Gates నేడు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ

Bill Gates : నేడు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, బిల్ గేట్స్ ఫౌండేషన్‌కు మధ్య కీలక ఒప్పందం కుదిరిన విషయం Read more

Justice Yashwant Varma : జస్టిస్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదు
Justice Yashwant Varma : జస్టిస్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదు

Justice Yashwant Varma : జస్టిస్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదు సుప్రీంకోర్టు తాజాగా విడుదల చేసిన వీడియో ఒక సంచలనంగా మారింది.జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో Read more

నేడు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ
Jana Sena formation meeting in Pithapuram today

అమరావతి: జనసేన 12వ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో పండగ వాతావరణంలో చేయడానికి ఏర్పాటు చేస్తోంది Read more

దేశంలోనే తొలిసారి.. మహిళలతోనే ప్రధానికి భద్రత
For the first time in the country, the Prime Minister will be provided security with women

న్యూఢిల్లీ : రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా గుజరాత్‌ లోని నవ్‌సారీ జిల్లాలో నిర్వహించబోయే ఉమెన్స్‌ డే వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *