ktr modi

మోడీ , రేవంత్ లపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పైన జుమ్లా పీఎం.. కింద హౌలా సీఎం. నేను స్పష్టంగా చెబుతున్నా. భయపడేది లేదు. ఈయనకు ఏం తెల్వదు. అనుకోకుండా తంతే గారెల బుట్టలో పడ్డట్లు వచ్చి పడ్డాడు’ అని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డితో పోరాడామని, రేవంత్ రెడ్డి తమకు ఓ లెక్క కాదన్నారు. రేవంత్ రెడ్డితో కొట్లాడేందుకు మనసు రావట్లేదన్నారు.

పాలన చేతకాక పనికిమాలిన మాటలు, పాగల్‌ పనులు చేస్తున్నారని, తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని సీఎం రేవంత్ పై కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలే చేశారు. మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయంలో (ప‌ర్ క్యాపిటాలో) తెలంగాణ దేశంలోనే నంబ‌ర్‌వ‌న్ అయిందని చెప్పారు. మూసీ ప్రాజెక్టులో రూ.లక్షా 50 వేల కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం సాధించిందని తెలిపారు. బిల్డర్లను, రియ‌ల్టర్లను బెదిరించ‌కుండానే ఐటీ ఎగుమ‌తుల్లో బెంగ‌ళూరును హైద‌రాబాద్ దాటేసిందన్నారు. మీ బడే భాయ్ మోదీ ఐటీఐఆర్‌ను రద్దు చేసినా, తెలంగాణకు ఒక రూపాయి సహాయం చేయకపోయినా, ఐటీ ఎగుమతులలో 2035లో చేరుకోవాల్సిన టార్గెట్‌ని పదకొండేండ్ల ముందే 2023లో చేర్చిన ఘనత కేసీఆర్ నాయకత్వానిదని స్పష్టం చేశారు. ఢిల్లీకి డ‌బ్బు సంచులు పంప‌కుండానే తెలంగాణ విత్తన భాండాగార‌మైందని, దేశంలోనే ధాన్యరాశిగా మారిందని తెలిపారు.

పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన‌ మాట‌లు.. ‌.. పాగ‌ల్ ప‌నులు. వెర‌సి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది

ఆడ‌లేక మ‌ద్దెల ఓడు అన్న‌ట్లు ప‌రిపాల‌న, అభివృద్ధి చేయ‌డం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్…. త‌నకు అంటిన బుర‌ద‌ను అంద‌రికీ అంటించాల‌ని చూస్తుంది…— KTR (@KTRBRS) October 18, 2024

Related Posts
Chiranjeevi : జీవిత సాఫల్య పుర‌స్కారం అందుకున్న మెగాస్టార్‌
Megastar receives lifetime achievement award

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లండన్‌లో ఉన్న విషయం తెలిసిందే. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌.. యూకే పార్లమెంట్‌లో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. 'లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌' Read more

అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
cbn ramdev

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ కలిశారు. బుధువారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కు చేరుకున్న బాబా..చంద్రబాబు ను కలిశారు. Read more

ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన
Health Minister Damodara Rajanarsimha

హైదరాబాద్‌: ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ కీలక ప్రకటన చేశారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మొబైల్ స్క్రీనింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే, Read more

నా వల్లే తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌ – సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణ తలసరి ఆదాయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విజన్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. Read more