Key comments by Eatala Rajender on BJP president

Eatala Rajendar: బీజేపీ అధ్యక్ష పదవీ పై ఈటల కీలక వ్యాఖ్యలు

Eatala Rajendar: బీజేపీ అధ్యక్ష పదవి మార్పు ఎప్పుడూ ఉంటుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు పార్టీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. మా పార్టీలో అధ్యక్షులు పదేళ్లు, ఇరవై ఏళ్లు వారసత్వంగా ఉండరు.. అని ఈటల హాట్ కామెంట్స్ చేశారు. మా ఢిల్లీ నాయకత్వం అంతా సమగ్రమైన ఆలోచనతో ప్రణాళికతో ఉన్నారని అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ లో జెండా పండుగ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో 70% రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తుందని చెప్పారు.

Advertisements
బీజేపీ అధ్యక్ష పదవీ పై ఈటల

బీజేపీ మాత్రమే నిజమైన పార్టీ

గత పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటు సాధించి సగం ఎంపీ సీట్లు గెలుచుకుని రేపటి ఎన్నికల్లో తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ప్రజలు మెసేజ్ అందించారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని చూసినం వారి పరిపాలన అనుభవమైందని, మళ్లీ ఓటు వేసే ప్రసక్తి లేదని ప్రజలు అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 10 నెలల కాలంలోనే ప్రజాక్షేత్రంలో విఫలమైందన్నారు. కాబట్టి రాబోయే కాలంలో రాష్ట్రం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి పథంలో నడపాలంటే బీజేపీ మాత్రమే నిజమైన పార్టీ అని ప్రజల్లో భావన ఉంది కాబట్టి.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది బీజేపీ పార్టీనే అని జోస్యం చెప్పారు.

వక్ఫ్ బిల్లు ద్వారా భూసమస్యలకు పరిష్కారం

బీజేపీ సిద్ధాంత ప్రాతిపదికన పనిచేసే పార్టీ అని అనేక మంది పార్టీ మేలు కోరేవారు, మద్దతు తెలిపే సంఘాలు ఉంటాయి. మన పార్టీలో ఎవరు పోటీచేసినా వ్యక్తులతో సంబంధం లేకుండా గెలుపు కోసం ప్రయత్నం చేస్తారన్నారు. వక్ఫ్ బిల్లు ద్వారా అనేక మంది 30-40 ఏళ్లుగా పడుతున్న భూసమస్యలకు పరిష్కారం దక్కనుందని చెప్పారు. పడుతున్న బాధలకు పరిష్కారం ఇవ్వనుంది. 14 దేవాలయం మీద దాడి జరిగితే అందులో మన దగ్గర ఉన్న ముత్యాలమ్మ గుడి కూడా ఉంది.

Related Posts
చైనాలో జనాభా సంక్షోభం..మూతపడుతున్న పాఠశాలలు..!
Population crisis in China.schools are closing

బీజీంగ్‌: చైనాలో జనాభా పెరుగుదల, జననాల రేటు పడిపోవడం అనే రెండు పెద్ద సమస్యలు ఒకే సమయంలో సంభవిస్తున్నాయి. పుట్టిన బాలల సంఖ్య తగ్గుతున్నది కాబట్టి, దేశ Read more

బీఆర్ఎస్ పార్టీ విప్‌లుగా కె.పి. వివేకానంద, సత్యవతి రాథోడ్
sathyavathi rathod and vivekananda

తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌లను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు. శాసనసభలో బీఆర్ఎస్ విప్‌గా కె.పి. వివేకానంద Read more

ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత ..50 శాతం ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం
Deteriorating air quality in Delhi .work from home for 50 percent employees

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. బుధవారం వరుసగా మూడో రోజుకూడా కాలుష్యం క్షీణించి Read more

Fish: అయ్యో చేప ఎంత పని చేసింది చివరకు ఏమైంది
Fish: అయ్యో చేప ఎంత పని చేసింది చివరకు ఏమైంది

తమిళనాడులోని చెన్నై సమీపంలో ఒక విషాదకర సంఘటన జరిగింది.మధురాంతకంలో ఉంటున్న మణికందన్ అనే 29 ఏళ్ల వ్యక్తి తాను పట్టుకున్న చేప తన శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో మరణించాడు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×