కొత్త పన్ను చట్టంలో కీలక మార్పులు

కొత్త పన్ను చట్టంలో కీలక మార్పులు

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆదాయపన్ను చట్టంలో పన్ను రహిత ఆదాయ పరిమితిని కొత్త టాక్స్ విధానం కింద రూ.12 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ ఇన్కమ్ టాక్స్ బిల్ 2025ను త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు.
రేపు పార్లమెంట్ ముందుకు
ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆదాయపు పన్ను బిల్లు 2025ను పార్లమెంట్ ముందుకు ఫిబ్రవరి 13న ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లు కింద సంక్లిష్టంగా ఉన్న పన్ను చట్టంలోని అంశాలను సరళీకృతం చేయాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పన్ను ఫైలింగ్ ప్రక్రియలో సమస్యలను తగ్గించి సులభతరం చేస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ కొత్త బిల్లులో 23 అధ్యాయాలు, 16 షెడ్యూల్‌లు, 536 క్లాజులు ఉన్నాయి.

Advertisements
కొత్త పన్ను చట్టంలో కీలక మార్పులు


టాక్స్ ఇయర్ రీప్లేస్
ఈక్రమంలో అసెస్మెంట్ ఇయర్ పదాన్ని టాక్స్ ఇయర్ రీప్లేస్ చేయనుందని తెలుస్తోంది. అలాగే ప్రీవియస్ ఇయర్ పదాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అనే పదంలో మార్పులు జరగనున్నాయని వెల్లడింది. పన్ను సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే 12 నెలల కాలాన్ని సూచిస్తుంది. దీనిని ఆర్థిక సంవత్సరంతో అలైన్ చేయాలని నిర్ణయించబడింది. అలాగే కొత్త ఆదాయపు పన్ను చట్టం బిల్లులో డిజిటల్ ట్రాన్సాక్షన్లు, క్రిప్టో ఆస్తులకు సంబంధించిన సమాచారం కూడా ఉండనుంది. అలాగే పన్ను చెల్లింపుదారుల రక్షణతో పాటు పారదర్శకతను పెంచేందుకు కీలక మార్పులు ఉండనున్నట్లు వెల్లడైంది. ప్రముఖ వార్తా సంస్థల నివేదిక ప్రకారం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రేట్ల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని వెల్లడించబడింది. జూలై 2024 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20 శాతానికి పెంచగా, లాంట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను రేటును 12.5 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

న్యూ టాక్స్ రీజిమ్ కింద మారిన శ్లాబ్ రేట్లు

*రూ.4 లక్షల వరకు – ఎలాంటి పన్ను ఉండదు

*రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను

*రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను

*రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం పన్ను

*రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆదాయంపై 20 శాతం పన్ను

*రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం పన్ను

* రూ.24 లక్షలకు పైగా ఉన్న ఆదాయంపై 30 శాతం పన్ను విధించబడుతుంది పాత పన్ను విధానం కింద ఉద్యోగులు రూ.50 వేల వరకు ఆదాయాన్ని స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో మినహాయింపుగా పొందవచ్చు. ఈ క్రమంలో వారికి ఉన్ వాస్తవ వేతన ఆదాయం లేదా రూ.50 వేలు వీటిలో ఏది తక్కువైతే అది క్లెయిమ్ చేసుకునేందుకు పన్ను చట్టంలో వెసులుబాటు కల్పించబడింది.

Related Posts
Exercise : ఇలాంటి వారు వ్యాయామం చేస్తున్నారా?
surgery patients2

శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికీ వ్యాయామం చేయడం అవసరం. రోజూ కొంత సమయం నడక, జాగింగ్, యోగా లేదా జిమ్ వంటివాటికి కేటాయిస్తే శరీరం ఫిట్‌గా Read more

అధికారులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు
New law in AP soon: CM Chandrababu

రాష్ట్రంలో భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నెల్లూరు సహా పలు జిల్లాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల జాగ్రత్తగా Read more

నేడు కుంభమేళాకు వెళ్లనున్న ప్రధాని
PM Modi will go to Kumbh Mela today

ప్రయాగరాజ్‌: ప్రధాని మోడీ ఈరోజు మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాగరాజ్‌కు చేరుకోనున్న ప్రధాని, అక్కడి త్రివేణీ సంగమంలో స్నానమాచరించి పూజలు నిర్వహిస్తారని ఆయన కార్యాలయం Read more

మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళా : మమతా బెనర్జీ
Religious Event Maha Kumbh Mela .. Mamata Banerjee

యూపీ సర్కారు వీఐపీలకు మాత్రమే ఏర్పాట్లు చేసిందని ఆగ్రహం కోల్‌కతా : ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్‌పై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లో Read more

×