PM Modi will go to Kumbh Mela today

నేడు కుంభమేళాకు వెళ్లనున్న ప్రధాని

ప్రయాగరాజ్‌: ప్రధాని మోడీ ఈరోజు మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాగరాజ్‌కు చేరుకోనున్న ప్రధాని, అక్కడి త్రివేణీ సంగమంలో స్నానమాచరించి పూజలు నిర్వహిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రధాని రాక దృష్ట్యా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం 10గంటలకు ప్రయాగ్ రాజ్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి అరైల్ ఘాట్ కు వెళ్తారు.

Advertisements
image

ఉదయం 11 గంటల సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తారు. అనంతరం ప్రయాగ్ రాజ్ ఎయిర్ పోర్టుకు వెళ్లి ఢిల్లీ బయలుదేరివెళ్తారు. ఈ పర్యటన సందర్భంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ ప్రధాని మోడీ పాల్గొనరని సమాచారం. మోడీ వస్తున్న నేపథ్యంలో నగరంతోపాటు కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాకు భారత్ తోపాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు.

ఇప్పటి వరకు 38కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్యులతోపాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కుంభమేళాకు హాజరవుతున్నారు.
కాగా, మహా కుంభమేళా ప్రారంభం కాకముందే వివిధ కార్యక్రమాల కోసం ప్రధాని మోడీ ప్రయాగ్‌రాజ్‌ వెళ్లారు. రూ.5500 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

Related Posts
గ్రేటర్ హైదరాబాద్‌కు కొత్త మెట్రో కారిడార్లు
గ్రేటర్ హైదరాబాద్ కు కొత్త మెట్రో కారిడార్లు

నూతన సంవత్సరం సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నార్త్ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. నగరంలోని ఉత్తర ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరిచే లక్ష్యంతో రెండు ముఖ్యమైన Read more

Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేస్తుందోచ్ !!
Amazon Great Summer Sale Da

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు గ్రేట్ సమ్మర్ సేల్ 2025ను అధికారికంగా ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్, ప్రైమ్ Read more

APSRTC ఉద్యోగులకు తీపికబురు
APSRTC ఉద్యోగులకు తీపికబురు

APSRTC ఉద్యోగులకు తీపికబురు.APSRTC ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2017 పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) బకాయిల్లో మరో 25 శాతం చెల్లింపునకు సంస్థ ఎండీ Read more

ఆర్జీ కార్ కేసులో నిందితుడి తల్లి ఆవేదన
ఆర్జీ కార్ కేసులో నిందితుడి తల్లి ఆవేదన

సంజయ్ రాయ్ తల్లి మాలతి రాయ్ శంభునాథ్ పండిట్ లేన్లలో నివసిస్తున్నారు. తన కుమారుడు సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించడంపై మాలతి, "నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, Read more

Advertisements
×