తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో అప్పుల పేరుతో జరిగే వేధింపులను నిలిపేందుకు ప్రభుత్వం కీలకంగా అడుగు వేసింది. రుణ గ్రహీతల రక్షణకు ఉద్దేశించిన బిల్లుకు గవర్నర్ ఆర్.ఎన్. రవి (Governor R.N. Ravi) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.తమిళనాడు శాసనసభ ఆమోదించిన ఈ బిల్లుకు ఇప్పుడు గవర్నర్ ఆమోదం లభించింది. ఇది రుణ సంస్థలపై నియంత్రణ కల్పించే చట్టంగా మారింది. ఇకపై రుణదాతలు లేదా వారి ఏజెంట్లు బలవంతపు వసూలు చేయలేరు.
వేధింపులకు ఐదేళ్ల జైలు శిక్ష
బిల్లోని నిబంధనల ప్రకారం, రుణగ్రహీతలపై ఒత్తిడి పెడితే, లేదా వారిని బెదిరిస్తే, సంబంధిత వ్యక్తులకు గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఇది రుణ సంస్థలకు గట్టిగా హెచ్చరికగా మారనుంది.వేధింపుల కారణంగా బాధితుడు లేదా అతని కుటుంబ సభ్యుడు ఆత్మహత్య చేసుకుంటే, సంస్థపై భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 108 ప్రకారం కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది చట్టపరంగా తీవ్ర చర్య.
ప్రభుత్వ ఉద్దేశం స్పష్టమని డిప్యూటీ సీఎం స్పష్టం
ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. రుణ సంస్థల అనైతిక రికవరీ పద్ధతుల వల్ల అనేకమంది మానసికంగా క్షీణించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరించారు.
సామాజిక సమతుల్యానికి గట్టి పునాది
ఇలాంటి ఘటనలు కుటుంబాలను విచ్చిన్నం చేయడమే కాక, సామాజిక శాంతికి కూడా భంగం కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి దుర్మార్గాల నుంచి వెనుకబడిన వర్గాలను రక్షించేందుకు ఈ చట్టం అవసరమని తెలిపారు.తమిళనాడులో ఈ కొత్త చట్టం అమలుతో రుణ గ్రహీతలకు భద్రత కలుగుతుంది. ఇది ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలవొచ్చు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజా సంక్షేమానికి ఒక మెరుగైన ముందడుగు. రుణ వేధింపులపై కఠిన చట్టాలు ఏర్పడటంతో ఇక అమాయక ప్రజల బలికాదు.
Read Also : Gaddar Awards : ఉత్తమ హీరోకు ఎంత ఇస్తారంటే?