లైంగిక దాడులు అంటే చాలా మంది ముందుగా మహిళలపై జరిగే నేరాలనే ఊహిస్తారు. పసిపిల్లల నుంచి పెద్దవయసు మహిళల వరకు దుర్మార్గుల బారిన పడుతున్నారని వార్తల్లో తరచూ చూస్తుంటాం. అయితే సమాజంలో కొన్నిసార్లు పురుషులు కూడా లైంగిక దాడులకు (Sexual assault) గురవుతున్నారన్న నిజం చాలా మందికి తెలియదు లేదా గుర్తించబడదు. ఈ రకమైన ఘటనలు తక్కువ సంఖ్యలో వెలుగులోకి వస్తున్నప్పటికీ,తాజాగా కేరళలో ఇలాంటి ఘోరమే జరిగింది.
ఓ 16 ఏళ్ల బాలుడిపై 14 మంది పురుషులు.. రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులందరూ ఎల్జీబీటీక్యూ (LGBTQ) వర్గానికి చెందిన వారి కోసం ప్రత్యేకంగా ఉన్న ఒక మొబైల్ యాప్ ద్వారా బాలుడితో స్నేహం పెంచుకున్నారు. మొదట మంచి మాటలతో నమ్మకం కల్పించి.. ఆ తర్వాత బాలుడి బలహీనతలను ఆసరాగా తీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ అఘాయిత్యం బాలుడి ఇంటితో పాటు కన్నూర్, కోజికోడ్ జిల్లాలతో (Kozhikode district) సహా అనేక ప్రదేశాలలో రెండు సంవత్సరాల పాటు కొనసాగింది.
చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు
మొత్తంగా 14 మంది తమకు ఇష్టం వచ్చినప్పడుల్లా బాలుడిపై అత్యాచారం (Rape) చేశారు. విషయం ఎవరికైనా చెబితే.. చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. దీంతో సదరు బాలుడు రెండేళ్లుగా నరకం అనుభవిస్తూ.. వారి చెప్పినట్లే నడుచుకున్నాడు.కానీ అదృష్టవశాత్తు ఓ రోజు బాలుడి తల్లి ఈ విషయం గుర్తించింది. ముఖ్యంగా ఓ నిందితుడు నేరుగా బాలుడి ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డాడు.

అదే సమయంలో బాలుడి తల్లి ఇంట్లోకి రాగా.. ఈ ఘటన ఆమె కంట పడింది. దీంతో నిందితుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన తల్లి బాలుడి (boy) ని ప్రశ్నించగా.. జరిగిన విషయం మొత్తం చెప్పాడు. తనకు జరుగుతున్న అన్యాయం గురించి వివరిస్తూనే విపరీతంగా ఏడ్చాడు. దీంతో బాలుడిని ఓదార్చిన తల్లి ఆపై.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ముఖ్యంగా బాలుడు చెప్పిన ఆధారాలతో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు.
9 మంది అరెస్ట్
అరెస్టు అయిన వారిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండడం ఈ కేసులో మరో సంచలన అంశంగా నిలిచింది. అయితే మిగతా ఐదుగురు నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వివరించారు. ఈ దారుణానికి పాల్పడిన వారందరినీ చట్ట ప్రకారం శిక్షించి.. బాధితుడికి న్యాయం చేకూర్చేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
మరోవైపు నెట్టింట ఈ వార్త వైరల్ అవుతుండగా.. పిల్లల తల్లిదండ్రులకు అనేక సూచనలు చేస్తున్నారు. పిల్లలు ఎలా ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, సెల్ఫోన్లో ఏమేం చూస్తున్నారు వంటివన్నీ ఓ కంట కనిపెడుతూ ఉండాలని వివరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: