KCR to attend assembly sessions

ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్న కేసీఆర్

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నారట. ఈ విషయాన్ని మీడియా చిట్ చాట్‌లో కేటీఆర్ ప్రకటించారు. ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు. తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారని తెలిపారు కేటీఆర్‌. కేసీఆర్ స్థాయి వేరు, వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు వినడానికి కేసీఆర్ రావొద్దు అనేది ఒక కొడుకుగా నా అభిప్రాయం అంటూ వ్యాఖ్యానించారు.

ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్న

మంత్రి వర్గ విస్తరణ కూడా చేయలేదు

కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ పార్టీలో ఎవరూ సరిపోరన్నారు. వేం నరేందర్ రెడ్డికి పదవి ఇప్పించు కోలేక పోయాడు అంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్‌ సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీ లో వినట్లేదన్నారు. ఆయన అనుచరులకు పదవులు ఇప్పించు కోలేక పోతున్నారని చురకలు అంటించారు. ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థుల ను చూస్తే అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. సొంత అనుచరుడు వేం నరేందర్ రెడ్డి కి కూడా పదవి ఇప్పించు కోలేక పోయాడని సెటైర్లు పేల్చారు. 39 సార్లు ఢిల్లీ కి పోయినా మంత్రి వర్గ విస్తరణ కూడా చేయలేక పోతున్నాడని కేటీఆర్‌ మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్ పార్టీ భేటీ

ఇక, బుధవారం అసెంబ్లీ బడ్డెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్ పార్టీ భేటీ కానుంది. అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలు.. సర్కార్‌పై సంధించాల్సిన ప్రశ్నలు..అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్‌. అయితే.. డైరెక్షన్‌ మాత్రమే కాదు డైరెక్ట్‌గా సభకు వస్తారంటున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. టీచర్స్‌, గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేసీఆర్‌ టోన్‌తో పొలిటికల్‌ సీన్‌ మారింది. బీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం సభలో ఉన్న బలం-బలగం ప్రకారం ఒక సీటు గెలవచ్చు.

Related Posts
కేసీఆర్ అధికారం కోల్పోయిన ఏడాది తర్వాత!
కేసీఆర్ అధికారం కోల్పోయిన ఏడాది తర్వాత!

తెలంగాణలో ఓ సీనియర్ మంత్రి దీపావళి ముందే రాజకీయ ఘర్షణలు ఉత్పత్తి అవుతాయని రెండు నెలల క్రితం అంచనా వేశారు. అయితే, ఇది జరగలేదు. ప్రతిపక్ష భారత Read more

క్షమాపణలు చెప్పిన సీవీ ఆనంద్‌
Allu Arjun Controversy Hyderabad Commissioner CV Anand Apologies

హైదరాబాద్‌: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. అల్లు అర్జున్, సంధ్య థియేటర్‌దే Read more

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి.. నిబంధనలు ఇవే..!!
Indiramma houses

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిబంధనలను విడుదల చేసింది. పేదలకు అందుబాటు ధరలో గృహనిర్మాణ అవకాశాన్ని కల్పించడానికి ఈ పథకం ప్రత్యేకంగా Read more

అమరావతి అభివృద్ధికి 50 వేల కోట్లు: సీఎం
అమరావతి అభివృద్ధికి 50 వేల కోట్లు: సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణ పనులు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. అమరావతి చుట్టూ 183 కిలోమీటర్ల విస్తీర్ణంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *