హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. తన ఫామ్ హౌస్ వదిలి తెలంగాణ భవన్ కు రాబోతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇందులో భాగంగానే ఇవాళ కెసిఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం జరగనుంది. రేపటి నుంచి కేసీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్తూన్నారు.

సమస్యలపై ఎలా పోరాడాలి అనే దాని పైన చర్చ
అటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలు, ఇతర సమస్యలపై ఎలా పోరాడాలి అనే దాని పైన కేసీఆర్ చర్చించబోతున్నారు. ప్రజల వద్దకు మరింత దగ్గర అయ్యేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సమావేశంలో పూర్తి అంశాలపై కేసీఆర్ చర్చించబోతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు రాజ్యసభ సభ్యులు అలాగే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఈ సమావేశానికి రానున్నారు.
ఫాంహౌస్కే పరిమితమైన కేసీఆర్
మొత్తానికి ఏడాదికి పైగా ఫాంహౌస్కే పరిమితమైన కేసీఆర్ తిరిగి యాక్టివ్ అవుతాను అంటున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్కసారి బడ్జెట్ సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చారు . ఉన్న కాసేపు ముళ్లమీద కూర్చున్నట్లు కూర్చుని వెళ్లిపోయారు . ఆరునెలలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే ఆయన ఆ ఒక్క రోజు కూడా సభకు వచ్చారన్న ప్రచారం జరిగింది .