kasthuri

పవన్ కళ్యాణ్ స్పందన పై కస్తూరి రియాక్షన్

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మరణం, అల్లు అర్జున్ పై కేసు, అతని అరెస్టు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన వంటి అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రముఖ నటి కస్తూరి.. పవన్ కళ్యాణ్ స్పందనపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. “పెద్దరికం అంటే పవన్. ఎంతో కచ్చితత్వంతో, పరిణతితో కూడిన స్పందన చేసారు. ఎక్కడా పక్షపాతం లేదు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు” అని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ విషాద ఘటనను పక్కన పెట్టి, 2025కు గ్రాండ్ గా వెల్ కం చెపుదాం అని పేర్కొంది.

పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అనేది చూస్తే..

బ‌న్నీ విష‌యంలో తెర ముందు, వెనుక ఏం జ‌రిగిందో నాకు తెలియ‌దు. ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో పోలీసుల‌ను త‌ప్పుప‌ట్ట‌ను. చ‌ట్టం అంద‌రికీ స‌మానమే. పోలీసులు త‌ప్ప‌కుండా భ‌ద్ర‌త గురించి ఆలోచిస్తారు. థియేట‌ర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయ‌న కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సింది. చెప్పినా ఆయ‌న‌కు ఆ అరుపుల్లో స‌రిగా వినిపించ‌క‌పోవ‌చ్చు. అల్లు అర్జున్ త‌ర‌ఫున బాధిత కుటుంబం వ‌ద్ద‌కు ముందే వెళ్లి ఉండాల్సింది. చిరంజీవి కూడా గ‌తంలో ఫ్యాన్స్‌తో క‌లిసి థియేట‌ర్‌లో సినిమాలు చూసేవారు. కానీ, ఆయ‌న ముసుగు వేసుకుని ఒక్క‌రే థియేట‌ర్‌కు వెళ్లేవారు అని చెప్పుకొచ్చారు.

Related Posts
ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం..
condoled the death of sm krishna

న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ (92) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన వృద్ధాప్యం రిత్యా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే Read more

క్వాలీజీల్ అత్యాధునిక సమర్ధత కేంద్రం
QualiZeel Launches 3rd State of the Art Competence Center in Hyderabad

హైదరాబాద్ : క్వాలిటీ ఇంజనీరింగ్ మరియు డిజిటల్ పరివర్తన సేవలలో అంతర్జాతీయంగా అగ్రగామి అయిన క్వాలీజీల్ , హైదరాబాద్‌లో తమ కొత్త సమర్ధత కేంద్రంను ప్రారంభించినట్లు వెల్లడించింది. Read more

ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే..!
ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే..!

ఢిల్లీలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న 7 నియోజకవర్గాల్లో బీజేపీ అనూహ్యంగా మంచి ప్రదర్శన చేసింది. మొదట ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆధిక్యంలో ఉన్నా, కౌంటింగ్ Read more

నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకం : డిప్యూటీ సీఎం
Self employment scheme for unemployed youth.. Deputy CM

హైదరాబాద్‌: నిరుద్యోగ యువతకి ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించనున్నారు. Read more