kasthuri

పవన్ కళ్యాణ్ స్పందన పై కస్తూరి రియాక్షన్

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మరణం, అల్లు అర్జున్ పై కేసు, అతని అరెస్టు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన వంటి అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రముఖ నటి కస్తూరి.. పవన్ కళ్యాణ్ స్పందనపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. “పెద్దరికం అంటే పవన్. ఎంతో కచ్చితత్వంతో, పరిణతితో కూడిన స్పందన చేసారు. ఎక్కడా పక్షపాతం లేదు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు” అని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ విషాద ఘటనను పక్కన పెట్టి, 2025కు గ్రాండ్ గా వెల్ కం చెపుదాం అని పేర్కొంది.

పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అనేది చూస్తే..

బ‌న్నీ విష‌యంలో తెర ముందు, వెనుక ఏం జ‌రిగిందో నాకు తెలియ‌దు. ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో పోలీసుల‌ను త‌ప్పుప‌ట్ట‌ను. చ‌ట్టం అంద‌రికీ స‌మానమే. పోలీసులు త‌ప్ప‌కుండా భ‌ద్ర‌త గురించి ఆలోచిస్తారు. థియేట‌ర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయ‌న కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సింది. చెప్పినా ఆయ‌న‌కు ఆ అరుపుల్లో స‌రిగా వినిపించ‌క‌పోవ‌చ్చు. అల్లు అర్జున్ త‌ర‌ఫున బాధిత కుటుంబం వ‌ద్ద‌కు ముందే వెళ్లి ఉండాల్సింది. చిరంజీవి కూడా గ‌తంలో ఫ్యాన్స్‌తో క‌లిసి థియేట‌ర్‌లో సినిమాలు చూసేవారు. కానీ, ఆయ‌న ముసుగు వేసుకుని ఒక్క‌రే థియేట‌ర్‌కు వెళ్లేవారు అని చెప్పుకొచ్చారు.

Related Posts
మొట్టమొదటి ఆల్-టెర్రైన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రారంభించిన క్వాంటా
Quanta launched the first all terrain electric motorcycle

కఠినమైన ఆల్-టెరైన్ పనితీరు కోసం రూపొందించబడిన, Quanta అనేది దేశంలోని ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలో కొత్త శకానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆవిష్కరణ, శక్తి మరియు స్థిరమైన చలనశీలత యొక్క Read more

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం.. విద్యార్థులకు ఇబ్బందులు
Board of Intermediate Nirwakam..Students are in serious trouble

ఇంటర్ మెమోలలో తప్పుగా ప్రింట్ అయిన ఫొటోలు.. హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం వెలుగు చూసింది. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేలా Read more

ఫిబ్రవరి 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఫిబ్రవరి 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఫిబ్రవరి 5న జరగనుంది. ఈ సమావేశంలో కుల గణన మరియు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణపై చర్చించనున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం Read more

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు మావోయిస్టు పార్టీ వార్నింగ్
brs congress

మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైన లేఖలో, దళిత బంధు పేరిట ప్రజలను మోసం చేశారని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *