నాలుగు రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి తెర లేవనుంది. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి టైటిల్ కోసం పోరాడనున్నాయి. పాక్, దుబాయ్ వేదికలలో ఈసారి టోర్నమెంట్ జరగనున్న విషయం తెలిసిందే. ఇక టోర్నీలో భాగంగా హైవోల్టేజీ మ్యాచ్ అయిన దాయాదుల పోరు ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరగనుంది. పాక్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి భారత జట్టును ఆ దేశానికి పంపించడానికి బీసీసీఐ అంగీకరించకపోవడంతో టోర్నమెంట్ హైబ్రిడ్ మోడ్ లో జరగుతున్న సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా తన మ్యాచ్ లను దుబాయ్ వేదికగా ఆడనుంది. భారత జట్టుపై గుర్రుగా ఉన్న పాకిస్థాన్ అభిమానులు తమ జట్టు ఆటగాళ్లకు తాజాగా కీలక సూచనలు చేశారు. మ్యాచ్ జరిగే సమయంలో ఎట్టిపరిస్థితుల్లో టీమిండియా ప్లేయర్లతో పాక్ ఆటగాళ్లు కరచాలనం చేయడం, హగ్ ఇవ్వడం లాంటివి చేకూడదని అంటున్నారు. కెప్టెన్ రిజ్వాన్ తో సహా ప్లేయర్లందరూ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లను కౌగిలించుకోవడం, స్నేహపూర్వకంగా మాట్లాడటం చేయరాదని తెలిపారు.మన దగ్గర ఆడటానికి వారు సుముఖంగా లేనప్పుడు, వారితో మనకు స్నేహం అక్కర్లేదు ప్రత్యర్థిగానే చూడాలి వారిపై గెలిచి మనమెంటో చూపించాలి అని సూచించారు. ఓ అభిమాని అయితే, ఈసారి భారత జట్టు బంగ్లాదేశ్ చేతిలో కూడా ఓడిపోవాలని తాము కోరుకుంటామని రోహిత్ సేనపై అసహనం వ్యక్తం చేశాడు.2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాక్ చేతిలోనే భారత్ కు పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. దాంతో టీమిండియా వరుసగా రెండోసారి టైటిల్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. 2013లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే.

హైబ్రిడ్ మోడల్ వల్ల భారత మ్యాచ్లు దుబాయ్లోనే
భారత క్రికెట్ నియంత్రణ మండలి పాకిస్తాన్ ఆతిథ్యంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నారు. భారత జట్టు పాకిస్తాన్ వెళ్లకుండానే తమ మ్యాచ్లను యూఏఈలో ఆడనుంది. దాంతో, భారత జట్టు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టకపోవడం పాక్ అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.
పాక్ అభిమానుల నుంచి జట్టుకు స్పెషల్ సూచనలు
భారత జట్టు తమ దేశానికి రాలేనప్పుడు, ఎందుకు ఆ జట్టుతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి? అంటూ పాకిస్తాన్ అభిమానులు తమ జట్టుకు కఠిన సూచనలు చేశారు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ రిజ్వాన్ సహా ఇతర ఆటగాళ్లు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇతర భారత ఆటగాళ్లతో చేతులు కలపడం, కౌగిలించుకోవడం లాంటివి ఎట్టిపరిస్థితుల్లో చేయవద్దని స్పష్టం చేశారు.