కన్నడ నటి రన్య రావును బంగారం అక్రమ రవాణా కేసులో బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక సంవత్సరంలోనే ఆమె దాదాపు 30 సార్లు దుబాయ్ వెళ్లినట్లు తెలిసింది. అలాగే ఒక్కో ట్రిప్ లో ఆమె కిలోల కొద్ది గోల్డ్ భారత్ తీసుకువచ్చినట్లు సమాచారం. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) చేపట్టిన దర్యాప్తులో ఆమెపై బంగారం స్మగ్లింగ్ ఆరోపణలు బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన అధికారులు, రన్య రావును ప్రధాన అనుమానితురాలిగా గుర్తించారు. దుబాయ్ నుంచి తరచుగా భారత్కు బంగారం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేశారు.

ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు, ఆమెను మూడు రోజుల పాటు డీఆర్ఐ కస్టడీలోకి అప్పగించింది. విచారణలో భాగంగా ఆమె స్మగ్లింగ్ ముఠా కోసం పనిచేస్తుందా? మరెవరెవరికి సంబంధాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా బంగారం అక్రమ రవాణాకు సంబంధించి ఎవరెవరు ప్రమేయం ఉన్నారనే దానిపై దృష్టి పెట్టారు. రన్య రావు అరెస్ట్ తర్వాత ఆమె కస్టడీలో ఉన్న సమయంలో ఓ ఫోటో వైరల్ అయింది. అందులో ఆమె ముఖం ఉబ్బిపోయి ఉండటం, గాయాలు ఉన్నట్లు కనిపించడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఫోటోపై తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే, దీని మీద అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు.
మహిళా కమిషన్ స్పందన
ఈ ఫోటోపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి చౌదరి స్పందించారు. “అధికారికంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే దర్యాప్తు ప్రారంభించగలము. రన్య రావు దాడి గురించి ఏమైనా ఫిర్యాదు చేస్తే, కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుంది. ఎవరిపైనా దాడి చేయకూడదు, అది చట్ట విరుద్ధం” అని ఆమె తెలిపారు. అయితే, రన్య రావు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ఫిర్యాదు చేయలేదు. అయితే బెంగళూరు పోలీసులు, ఆమెపై లాఠీ ఛార్జ్ జరిగినట్టు వచ్చిన వార్తలను ఖండించారు. “రన్య రావును చట్టపరమైన విధానంలోనే విచారిస్తున్నాం. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది” అని తెలిపారు. అంతేకాదు, ఈ కేసులో ఇంకా కొన్ని ముఖ్యమైన వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఈ విషయాన్ని పరిశీలించమని కమిషనర్కు లేఖ రాయకపోతే లేదా నాకు లేఖ పంపకపోతే, ఆమెకు సహాయం చేయమని, ఆమెకు మద్దతు ఇవ్వమని, సరైన దర్యాప్తు నిర్వహించమని, నివేదికను సమర్పించమని మేము సంబంధిత అధికారులకు లేఖ రాస్తామని ఆమె ఫిర్యాదు చేయలేదు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను అని అన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. పలువురు నెటిజన్లు రన్య రావు అక్రమ కార్యకలాపాలను తప్పుపడుతున్నారు. మరోవైపు, పోలీసులు ఆమెను హింసించి ఉంటే, దానికి సమర్థించలేమని కొందరు వాదిస్తున్నారు. మొత్తం మీద ఈ కేసు ప్రస్తుతం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి రన్య రావు అరెస్టు, విచారణ, వైరల్ ఫోటో వివాదం – అన్నీ కలిసికట్టుగా చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసు ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడాలి.