हिन्दी | Epaper
అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

Telugu News: Jupally Krishna Rao-ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనే యోచన కెటిఆర్ ది

Pooja
Telugu News: Jupally Krishna Rao-ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనే యోచన కెటిఆర్ ది

Jupally Krishna Rao: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని ఆలోచన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ దే అని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో(Press conference) మాట్లాడుతూ, 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నేడో, రేపో కూలిపోతుందని కేటీఆర్ అన్నారనీ, దానిపై ఆయన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు “సిగ్గు ఉందా?” అని అడిగిన కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

Jupally Krishna Rao

తెలంగాణ కోసం చేసిన త్యాగాలపై విమర్శ

తెలంగాణ రాష్ట్రం(Telangana State) కోసం వందలాది మంది యువకులు ప్రాణత్యాగం చేసినా, అమరుల ఆశయాలకు అనుగుణంగా ఒక్క పని కూడా చేయలేదని జూపల్లి అన్నారు. బదులుగా అమరుల ఆత్మలకు తూట్లు పొడిచే పనులు ఎన్నో చేశారని ఆరోపించారు.

చెప్పులు మోసిన సంతోష్‌రావుకు ఎంపీ పదవి ఇచ్చినప్పుడు ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. వేల కోట్లు అక్రమార్జన చేశారని కవితే చెప్పిందని, ఆమె అబద్ధం చెప్పలేదని పేర్కొన్నారు. కవిత, కేటీఆర్ ఇద్దరూ ఒకటేనని, కెసిఆర్ కుటుంబమంతా ఒకే ముక్క అని వ్యాఖ్యానించారు.

అప్పుల కుప్పగా మారిన తెలంగాణ

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినందుకు కేటీఆర్ సిగ్గుపడాలని జూపల్లి అన్నారు. వాస్తవాలు మాట్లాడితే వాటిని వక్రీకరించి బూతులుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ లేదా సుప్రీంకోర్టు ఆదేశాల(Supreme Court orders) ప్రకారమే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి విషయానికి ఒక సమయం, సందర్భం ఉంటుందని, కేటీఆర్ వాస్తవాలకు, బూతులకు తేడా తెలియని వ్యక్తి అని ఆయన తీవ్రంగా విమర్శించారు.

నా మాటలను వక్రీకరించారు: జూపల్లి

ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పోటీ చేసిన సందర్భంలో ఎవరు గెలుస్తారో తెలియదని, గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో ముందుగా చెప్పలేమని అన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చగలమో లేదో అనిశ్చితి ఉంటుందని చెప్పారు. అందువల్ల తాను ఎటువంటి హామీలు ఇవ్వనని, కానీ నిజాయితీగా కష్టపడి పని చేస్తానని మాత్రమే ప్రజలకు హామీ ఇస్తానని స్పష్టం చేశారు. అందుకే ఏడు సార్లు పోటీ చేస్తే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని జూపల్లి కృష్ణారావు గుర్తు చేశారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు కేటీఆర్‌పై ఏ ఆరోపణలు చేశారు?
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని కేటీఆర్ ఆలోచిస్తున్నారని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించారని ఆయన ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏ సమస్యతో ముడిపెట్టారు?
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మంత్రి జూపల్లి విమర్శించారు.

Read Hindi News: hindi.vaartha.com

Read also :

https://vaartha.com/g-t-jeevan-focus-should-be-on-strengthening-government-sector-institutions/telangana/546345/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సర్పంచుల హక్కులకోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ – KTR

సర్పంచుల హక్కులకోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ – KTR

రవీంద్రభారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

రవీంద్రభారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

యూరియా కొరత నివారణ ఇంటి నుంచే.. బుకింగ్ కోసం కొత్త యాప్!

యూరియా కొరత నివారణ ఇంటి నుంచే.. బుకింగ్ కోసం కొత్త యాప్!

రేవంత్ ప్రభుత్వంపై కవిత విమర్శలు

రేవంత్ ప్రభుత్వంపై కవిత విమర్శలు

BC రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేటు బిల్లు – మహేశ్ గౌడ్

BC రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేటు బిల్లు – మహేశ్ గౌడ్

2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా – కవిత

2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా – కవిత

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు.. వెలుగులోకి ఫోన్ కాల్ రికార్డ్!

కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు.. వెలుగులోకి ఫోన్ కాల్ రికార్డ్!

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

2029 ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత

2029 ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.. గాల్లో ఎగిరి క్షణాల్లో మరణించాడు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.. గాల్లో ఎగిరి క్షణాల్లో మరణించాడు

న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు

న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు

📢 For Advertisement Booking: 98481 12870