हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Jogi Ramesh: అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తాం: జోగి రమేష్

Sharanya
Jogi Ramesh: అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తాం: జోగి రమేష్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే, అవసరమైతే సీఎం నివాసాన్ని మాత్రమే కాకుండా శాసనసభను కూడా ముట్టడించేందుకు వెనుకాడమని హెచ్చరించారు.

Jogi Ramesh: అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తాం: జోగి రమేష్
Jogi Ramesh: అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తాం: జోగి రమేష్

ఇబ్రహీంపట్నం నుంచి విలేకరుల సమావేశంలో

ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. ప్రజా పక్షాన నిలబడి పోరాడతామని స్పష్టం చేశారు.

సూపర్ సిక్స్ హామీలపై పోరు

ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రజల తలరాత మార్చేదామన్న హామీలు ఆవిరైపోతే, తామేం చూస్తూ కూర్చోం. న్యాయం కోసం పోరాటం తప్పదు, అన్నారు.

కొండపల్లి మున్సిపాలిటీ వివాదం

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు గలసిన విధానం ప్రజాస్వామ్యానికి కళంకమని జోగి రమేశ్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ అక్కడ విజయం సాధించిందని విమర్శించారు. “సీల్డ్ కవర్‌లో ఏముందో వారం రోజులుగా ఎందుకు తెరవలేదు? కొండపల్లి మున్సిపాలిటీ నుంచే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందో, వ్యతిరేకత ఉందో తేలిపోతుంది. దమ్ముంటే మళ్లీ అక్కడ ఎన్నికలు నిర్వహించండి, ప్రజలు మీకు ఓట్లు వేస్తారో లేదో తెలుస్తుంది” అని సవాల్ విసిరారు.

వసంత కృష్ణప్రసాద్‌పై ఘాటు వ్యాఖ్యలు

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను ఉద్దేశించి జోగి రమేశ్ వ్యాఖ్యానిస్తూ, “వసంత కృష్ణప్రసాద్ ఓ బుడంకాయ్. నందిగామలో ఎందుకు ఓడిపోయాడో చెప్పాలి. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది వైసీపీ, జగన్మోహన్ రెడ్డి కాదా?” అని ప్రశ్నించారు.

ప్రజా పోరాటం కొనసాగుతుంది

ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతామని జోగి రమేశ్ ఈ సందర్భంగా తెలిపారు. శాసనసభలోనే కాదు, రోడ్లపై కూడా ప్రజా హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

Read also: Chittoor: భర్త చేసిన అప్పుకు భార్య పట్ల అమానుషం

Chandrababu Naidu : కార్యకర్తలు అలిగే పరిస్థితి రానివ్వనన్న చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870