Jayashankar for Trump inauguration

ట్రంప్ ప్రమాణ స్వీకారానికి జయశంకర్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ ఈరోజు స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని అనేక దేశాల నేతలు హాజరు కానున్నారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనిక వ్యాపారవేత్తలు, టెక్ నిపుణులు కూడా రానున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ముగ్గురు టెక్ దిగ్గజాలు హాజరుకానున్నారు. వారిలో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. వీరితోపాటు భారత సంతతికి చెందిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా కలరు. అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత ప్రతినిధిగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ హజరువుతున్నారు. ఇప్పటికే ఆయన వాషింగ్టన్ చేరుకున్నారు. మరో పక్క భారత వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ దంపతులు కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్నారు.

Advertisements
image
image

ఒకప్పుడు ట్రంప్‌ను ‘ఆత్మస్నేహితుడు’ అని పిలిచిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వేడుకలో పాల్గొనడం లేదు. భారత్ తరఫున జై శంకర్ పాల్గొంటున్నారు. దీంతోపాటు భారత పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ హాజరవుతున్నారు. ఇప్పటికే ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రెండు రోజుల ముందు, రాజధాని వాషింగ్టన్ డీసీలో వేలాది మంది వచ్చారు. మరోవైపు పదవీ విరమణ చేస్తున్న అధ్యక్షుడు జై బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పాత వేడుక సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తున్నారు. దీనిలో ఓడిపోయిన అభ్యర్థులు విజేతలతో వేదికను పంచుకుంటారు.

కాగా, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ. బుష్, బిల్ క్లింటన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తన వీడ్కోలు ప్రసంగంలో అమెరికా కొంతమంది టెక్ బిలియనీర్ల ఆధిపత్యంలో ఉన్న ఒక సామ్రాజ్యం మారవచ్చని బైడెన్ వ్యాఖ్యానించారు. కానీ అక్కడి కార్యాలయం అతిథుల అధికారిక జాబితాను విడుదల చేయలేదు. ఈ జాబితా గురించి ఇంకా చాలా చర్చలు కొనసాగుతున్నాయి. ట్రంప్ వేడుకకు హాజరయ్యే వ్యక్తుల జాబితాలో ప్రపంచంలోని అతిపెద్ద నాయకులు, మిత్రులు, స్నేహితులు, శత్రువులు సహా అనేక మంది ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన వ్యక్తులు రానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఘనంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

Related Posts
Telangana : 400 ఎకరాల భూమిపై హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana 400 ఎకరాల భూమిపై హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. వట ఫౌండేషన్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయు) విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన Read more

Myanmar Earthquake: 700 దాటిన మయన్మార్‌ మృతుల సంఖ్య..
Myanmar Earthquake: 700 దాటిన మయన్మార్‌ మృతుల సంఖ్య..

మయన్మార్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.2గా నమోదైందని అక్కడి నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తాజా ప్రకటనలో వెల్లడించింది. భూకంపం రావడంతో ఒక్కసారిగా Read more

కర్ణాటకలో రెండు HMPV వైరస్ కేసులు
కర్ణాటకలో రెండు HMPV వైరస్ కేసులు

కర్ణాటకలో రెండు హ్యూమన్ మెటాప్యూమోవైరస్ (హెచ్ఎమ్పివి) కేసులు నమోదయ్యాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సోమవారం ధృవీకరించింది. వివిధ శ్వాసకోశ వైరస్ల కోసం ఐసిఎంఆర్ Read more

Central Cabinet: తిరుపతి – కాట్పాడి లైన్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదం
తిరుపతి - కాట్పాడి లైన్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదం

కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మూడో సారి అధికారం లోకి వచ్చిన తరువాత మోదీ ప్రభుత్వం ఏపీకి సంబంధించి పలు ప్రాజెక్టులకు Read more

×